కేయూ ఆర్ట్స్ డీన్ గా ఆచార్య జ్యోతి

కేయూ క్యాంపస్
కాకతీయ విశ్వవిద్యాలయ ఆర్ట్స్ విభాగాల డీన్ గా మరియు తెలుగు విభాగ అధిపతిగా ఆచార్య ఏటూరి జ్యోతి ని నియమిస్తూ రిజిస్ట్రార్ ఆచార్య పి. మల్లారెడ్డి ఉత్తర్వులు జారీ చేసారు. ఆచార్య జ్యోతి విశ్వవిద్యాలయంలో 2007 సంవత్సరం లో సహాయ ఆచార్యులు గా ప్రవేశించారు. ఆచార్య జ్యోతి గతంలో విభాగ అధిపతి గా, పాఠ్య ప్రణాళిక అధ్యక్షురాలు గా, మహిళా అధ్యయన కేంద్ర సంచాలకురాలు గా, ఎస్.సి, ఎస్.టి సెల్ సంచాలకులు గా, జెండర్ స్టడీస్ ఇంచార్జ్ గా, విశ్వవిద్యాలయ కేంద్ర గ్రంధాలయ మెంబెర్ ఇంచార్జ్ వివిధ పదవి బాధ్యతలు నిర్వహించారు. ఆచార్య జ్యోతి పర్యవేక్షణలో నలుగురు డాక్తోరాటే పొందారు. 106 పత్రాలను వివిధ జాతీయ, అంతర్జాతీయ సదస్సులల్లో సమర్పణ చేసారు, 4 పుస్తకాల కు సంపాదకీయం వహించారు. ఆచార్య బన్న అయిలయ్య పదవి విరమణ చెందటం తో ఈ ఖాళి ఏర్పడింది. ఆచార్య జ్యోతి ఆచార్య బన్న అయిలయ్య నుంచి బాధ్యతలు స్వీకరించారు. ఆచార్య జ్యోతి ని పలువురు బోధనా, బోధనేతర సిబ్బంది, పరిశోధకులు, విద్యార్థులు అబినందించారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version