శిక్షణ కోర్సులకై ఫ్యాకల్టీ ల ధరఖాస్తుల స్వీకరణ.
సింగరేణి సేవా సమితి
భూపాలపల్లి నేటిధాత్రి
https://youtu.be/noKiE2XIQfg?si=L7oOaMMyR-BikAwq
2025 – 26 ఆర్థిక సంవత్సరానికి గాను సింగరేణి సంస్థ భూపాలపల్లి ఏరియా సేవ సమితి ఆధ్వర్యంలో నిర్వహించనున్న వృత్తి విద్యా కోర్సులైన
కంప్యూటర్ (డిటిపి), మగ్గం వర్క్, స్పోకెన్ ఇంగ్లిష్, బ్యూటీషియన్,ఫ్యాషన్ డిజైనింగ్ , మల్టీ మీడియా , జ్యూట్ బ్యాగ్,(ఓసి ప్రభావిత గ్రామాల మహిళలకు టైలరింగ్) వంటి కోర్సులను నేర్పించుటకు ఫాకల్టీ గా పని చేయుటకు ఆసక్తి,అర్హతఅనుభవం గలవారి నుండి దరఖాస్తులు ఆహ్వానించడం జరుగుతుందని ఏరియా పర్సనల్ మేనేజర్ కే. మారుతి తెలియ జేసారు.అర్హత ఆసక్తి కలిగిన ఫ్యాకల్టీ సభ్యులు 25-10-2025- రోజున ధరఖాస్తులు చివరి తేదిగా నిర్ణయించారు. తమ యొక్క దరఖాస్తులను తగిన అర్హత,అనుభవాల,దృవపత్రలను,జతపరిచి పర్సనల్ విభాగం నందు అందజేయగలరని వారు తెలిపారు .