లింగ వివక్ష లేని సమాజం నిర్మాణం కావాలి. రాజకీయ రంగాలలో మహిళా ప్రాతినిధ్యం పెరగాలి.
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ మండలంలోని ఖాసింపూర్ గ్రామంలో మహిళా కాంగ్రెస్ అధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ ముందస్తు ఉత్సవాలు జరుపుకున్నారు..ఈ కారీక్రమంలో కేక్ కట్ చేసి ఒకరి కొకరు తినిపించుకోవడం జరిగింది. తదనంతరం కరిక్రమంలో పల్గొనడానికి విచ్చేసిన మహిళల్ని ఉద్దేశించి మాట్లాడిన జహీరాబాద్ నియోజకవర్గ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అస్మా మహిళలకు మద్దతుగా ఎవరు రానక్కరలేదు. వాళ్ళకు ఒక గళం ఉంది. దాని ఉపయోగించు కోడానికి ముందుకు వచ్చినప్పుడు సాధికారత సాధించినట్లే .అన్ని రంగాలలో అడుగు పెట్టాలి ఇంకా మనల్ని వెనకకు లాగుతోంది ఏంటో తెలుసుకోవాలి ?ఆత్మ విశ్వాసం, ఆత్మ గౌరవం కోరడం, ఏ సమస్య ఎదురైన నిబ్బరంగా ఎదుర్కుంటూ ముందుకు వెళ్ళండి-ప్రతి సవాలూ మనలో ధైర్యాన్ని నింపుతుంది. కొత్త విషయాలు నేర్పుతుంది అంతేకాని నావల్ల ఏమీకాదు. నేనేమీ చేయలేను అని ఊరుకుంటే అక్కడే ఉండిపోతాం అలాగే నేర్చుకోవడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండండి మన హక్కులు బాధ్యతలను గ్రహిస్తూ, శక్తియుక్తులను ఆవిష్కరిస్తూ సాగడమే అసలైన మహిళా సాధికారత.ఈ కారీక్రమంలో మహిళా కాంగ్రెస్ ముఖ్య నాయకురాలు చంద్రకళ, స్వప్న, ఈశ్వరమ్మ, భాగ్యలక్ష్మి, బుజ్జమ్మ, పారమ్మ, వినోద, భరతమ్మ, సిద్దమ్మ, సువర్ణ, సురేఖ, సంగమ్మ, లక్ష్మమ్మ తదితరులు పాల్గొన్నారు.
