26వ పాత పంటల జాతర జనవరి 14న ప్రారంభం.
జహీరాబాద్ నేటి ధాత్రి:
సంగారెడ్డి జిల్లా, జహీరాబాద్ మండలం జంలైతాండ గ్రామంలో జనవరి 14న 26వ పాత పంటల జాతర ప్రారంభం కానుంది. డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ ( డిడిఎస్ ) ఆధ్వర్యంలో నిర్వహించబడే ఈ జాతర 14 గ్రామాల్లో జరిగి, ఫిబ్రవరి 13, 2026న మాచునూర్లో ముగుస్తుందని డిడిఎస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ దివ్య వెలుగురి తెలిపారు. పాత పంటల సంరక్షణకు మద్దతు తెలిపేవారు ఈ జాతరలో పాల్గొనాలని ఆమె పిలుపునిచ్చారు.
