మేడిపల్లి(నేటీదాత్రీ): బోడుప్పల్ మున్సిపల్ కార్పోరేషన్ 24వ డివిజన్ లో సిసి రోడ్డు పనులను గుర్రాల రమా వెంకటేష్ యాదవ్ ప్రారంభించారు. ఈ మేరకు డివిజన్ పరిధిలోని గణేష్ నగర్ కాలనీలో 13 లక్షల 50వేల రూపాయలతో నిర్మిస్తున్నారు. డివిజన్ లో ప్రతి కాలనీకి రోడ్డు సదుపాయం కల్పించడానికి కృషి చేస్తున్నామని అన్నారు. అనంతరం మాట్లాడుతూ డివిజన్ పరిధిలో ప్రతి కాలనీకి అన్ని రకాల మాలిక వసతులు కల్పిస్తున్నామని, నిరంతరం సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో గణేష్ నగర్ కాలనీ అధ్యక్షులు నర్సింగ్ రావు, సభ్యులు కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.