200 కు 200 కిలోల ఇసుక.

200 కు 200 కిలోల ఇసుక.

కలెక్షన్ కింగ్ టిఎస్ఎండిసి. పలుకుల6, పుసుపల్లి లో దర్జాగా వసూళ్లు.

కాంటాల వద్ద టీఎస్ఎండిసి సిబ్బంది మాఖామ్,దర్జాగా వసళ్ళు.

పాసింగ్ పై ఎక్కువ ఇసుక వేయాల్సిందే,, టిఎస్ఎండిసి సిబ్బంది.

వసూళ్ల పర్వం పై ఆగ్రహిస్తున్న డ్రైవర్లు.

బొమ్మపూర్ పుసుపల్లి మహాదేవపూర్, లకు ధీటుగా, పూసుకుపల్లి పలుగుల6, పుసుపుపల్లి వన్.

మహాదేవపూర్ -నేటిధాత్రి:

 

ఇసుక అక్రమ రవాణా ఎక్కడ ఆగుతుంది, అక్రమ వసూళ్లకు టి ఎస్ ఎం డి సి కాంట్రాక్టర్లకు గుమస్తాలుగా మారి, దర్జాగా వసూళ్లు చేస్తూ లక్షల రూపాయలను కట్టబెట్టడం జరుగుతుంది. ఇప్పటికే మహాదేవపూర్ మండలంలోని బొమ్మాపూర్ ఎలికేశ్వరం, తోపాటు మహాదేవపూర్ పుసుపల్లి, పేరుతో నిర్వహించబడుతున్న ఇసుక రీచ్ లలో, అక్రమ వసూళ్లు ఝాట్కా బకెట్ లాంటి కొనసాగుతుంటే, మరోవైపు కాళేశ్వరం పరిధిలోని పుసుపల్లి పలుగుల ఆరు,పూసుకుపల్లి ఒకటి నంబర్ క్వారీలు దర్జాగా, పాసింగ్ తో పాటు మరో 200 కిలోల ఇసుక, 200 రూపాయలు తీసుకొని వేయడం జరుగుతుంది, పలుగుల ఆరు దర్జాగా టీఎస్ ఎం డి సి సిబ్బంది, కాంటా వద్ద ఉండి వసూలు చేస్తున్నారు. మరోవైపు పలగుల ఒకటవ క్వారీ వద్ద టిఎస్ఎండిసి సిబ్బంది, పాసింగ్ తర్వాత 100 నుండి 200 కిలోల ఇసుక వేయడం శరమాములే అని, దర్జాగా చెప్పడం జరుగుతుంది.

200 to 200 kg of sand.

 

ఇప్పటికే మండలంలో బొమ్మ పూర్ లింగేశ్వరం మహాదేవపూర్ పుసుపుపల్లి ఒకటవ నంబర్ క్వారీలో, హద్దు అదుపు లేకుండా ఇసుక అక్రమ రవాణా కొనసాగుతున్న క్రమంలో, తాజాగా ఈరోజు పలుగుల 6, పూసుకుపల్లి ఒకటి ఇసుక రిచుల్లో ఒక్క లారీకి 1100, నుండి 900 వరకు రెండు క్వారీల్లో, వసూలు చేయడమే కాక, 150 నుండి 200 కిలోల ఇసుక, పాసింగ్ కు అదనంగా తరలిస్తున్నారు. ఇలా ప్రతిరోజు సుమారు ఈ రెండు ఇసుక క్వారీలు పుసుపల్లి ఒకటవ నంబర్ భారీ మొత్తంలో ప్రతిరోజు 150 కి పైచిలుకు ఇసుక లారీల్లో ఇసుక రవాణా చేస్తుంది.ఈ క్వారీ అత్యధికంగా లారీల లోడింగ్ 240 వరకు చేసింది. వసూళ్లు కూడా ఈ క్వారీ లారికి 1100 రూపాయలు, తీసుకోవడంతోపాటు అదనపు ఇసుకను రవాణా చేస్తుంది.

 

మరోవైపు పుసుక్ పల్లి పలుగుల ఒకటవ నంబర్. ఇసుక రీచ్ లో మాత్రం టీఎస్ఎండిసి సిబ్బంది స్వయంగా కూర్చొని, అదనపు ఇసుక వేయడం తప్పేమీ కాదని, పాసింగ్ కు 150 నుండి 200 కిలోల ఇసుక వేయడం మామూలే అని చెప్పుకొచ్చాడు, ఈ క్వారీలో 700 రూపాలు లోడింగ్ సిరియల్ తో పాటు, లోడింగ్ వద్ద మరో 200, మెయింటినెన్స్ కింద వసూలు చేస్తున్నారు. ఇప్పటికే అక్రమ ఇసుక రవాణా జరగడంలేదని, గొప్పలు చెప్పుకుంటున్న టీఎస్ ఎండిసీ, పలుకుల సిక్స్,పూసుకుపల్లి, వన్క్వారీ లో , టి ఎస్ ఎమ్ డి సి, సిబ్బంది కూర్చుని దర్జాగా అదనపు వసూళ్లు చేసి పాసింగ్ కన్నా 200 కిలోల ,ఇసుక ఎక్కువ వేయడం తప్పేమీ కాదు, అని చెప్తున్నారంటే, టీఎస్ టి ఎస్ ఎం డి సి అధికారుల కలుసైగల్లోనే, ఇసుక రీచుల్లో అక్రమాలు జరుగుతున్నాయని చెప్పడానికి ఇంకేమీ కావాలో మరి, ఇప్పటికీ ఏ ఒక్క అధికారి కూడా ఇసుక రిచుల్లో జరుగుతున్న అక్రమాలపై, విచారణ చేయించకపోవడం, సాక్షాలు చూపెట్టినప్పటికీ కూడా చర్యలు తీసుకోకుండా ,నేటికీ ఇసుక క్వారీలు మరింత రెట్టింపు ఉత్సాహంతో అక్రమ వసూళ్లు, అక్రమ ఇసుక రవాణా చేస్తున్నారంటే, టి ఎస్ ఎం డి సి, మైనింగ్ శాఖ, అధికారుల ప్రోత్సాహం ఉందని స్పష్టంగా అర్థమవుతుంది.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version