సిద్దిపేట నియోజకవర్గానికి గురువారెడ్డి చేసిన సేవలు మరువలేనివి

మున్సిపల్ చైర్మన్ మంజుల-రాజనర్సు, రాష్ట్ర ప్రెస్ అకాడమీ సభ్యులు అంజయ్య

సిద్దిపేట నేటి ధాత్రి

సిద్దిపేట నియోజకవర్గానికి ఎడ్ల గురువారెడ్డి చేసిన సేవలు మరువలేనివని సిద్దిపేట మున్సిపల్ చైర్మన్ కడవేర్గు మంజూల-రాజనర్సు, రాష్ట్ర ప్రెస్ అకాడమీ సభ్యులు కొమరవెల్లి అంజయ్య అన్నారు. ఎడ్ల గురువారెడ్డి వర్ధంతిని పురస్కరించుకొని సోమవారం విక్టరీ టాకీస్ చౌరస్తా వద్ద వారి కౌంస్య విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నిజం రజాకార్ల ఆగడాలు, అకృత్యాలకు వెట్టిచాకిరికి వ్యతిరేకంగా అలుపెరుగని పోరాటం చేశారని, సంఘసేవకునిగా, శాసనసభ్యుడిగా, శాసనమండలి సభ్యులుగా నీతి నిజాయితీ, నిబద్ధత కలిగిన కమ్యూనిస్టుగా నిరాడంబర జీవితం గడిపి సిద్దిపేట ప్రాంతానికి అనేక వనరులు తీసుకొచ్చి తుది శ్వాస వరకు ఈ ప్రాంత అభివృద్ధికి అశేషమైన కృషి చేశారని గుర్తు చేశారు. నియోజకవర్గానికి వారు చేసిన సేవలు మరువలేనివని, వారి ఆశయ సాధన కోసం ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి మంద పవన్, రాష్ట్ర ఉన్నత విద్యా మండలి మాజీ సభ్యులు డా”పాపయ్య, సీపీఐ రాష్ట్ర కంట్రోల్ కమిషన్ సభ్యులు ఎడ్ల వెంకట్రాంరెడ్డి,

మున్సిపల్ వైస్ చైర్మన్ జంగిటి కనకరాజు, సీపీఐ పట్టణ కార్యదర్శి బన్సీలాల్, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అందె అశోక్, కనుకుంట్ల శంకర్, జిల్లా సమితి సభ్యులు పలువురు మున్సిపల్ కౌన్సిలర్లు, సీపీఐ ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version