రైతును రాజు చేయడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం

కొడకండ్ల ,(జనగామ) ,నేటిధాత్రి :

రైతును రాజు చేయడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని కొడకండ్ల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాపాక సత్యనారాయణ అన్నారు. మండలంలోని రామవరం, రామేశ్వరం గ్రామాలలో కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు ధరావత్ సురేష్ నాయక్ అధ్యక్షతన నిర్వహించిన రైతు రచ్చబండ కార్యక్రమం లో భాగంగా ప్రతి ఇంటికి, మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పనులు జరుగుతున్న ప్రదేశానికి వెళ్లి వరంగల్ రైతు డిక్లరేషన్ గురించి ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా రాపాక సత్యనారాయణ మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రెండు లక్షల రూపాయల రైతు రుణమాఫీ ఏకకాలంలో చేస్తుందని ,తెలంగాణలో పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నాయకత్వంలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే అని అన్నారు. అనంతరం సురేష్ నాయక్ మాట్లాడుతూ మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం 2006లో కాంగ్రెస్ పార్టీ తెచ్చిన పథకం అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ సామాన్యులకు న్యాయం చేకూర్చే పథకాలు తీసుకు వస్తుందని తెలిపారు. కేంద్రంలో, రాష్ట్రంలో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని రాహుల్ గాంధీ సాక్షిగా వరంగల్ రైతు డిక్లరేషన్ ఇచ్చిన హామీలను అమలు చేసి తీరుతామని అన్నారు. రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి సోమనర్శయ్య , మండల బీసీ సెల్ అధ్యక్షుడు రమేష్, ఎస్సీ సెల్ అధ్యక్షుడు బిక్షపతి,ఎస్టి సెల్ అధ్యక్షుడు రాహుల్ నాయక్, మండల ప్రధాన కార్యదర్శి అంజయ్య, నియోజకవర్గ నాయకుడు భూక్య శ్రీను, భార్గవ్, మండల యువజన నాయకుడు బొమ్మరబోయిన మహేందర్, పాలకుర్తి యూత్ అధ్యక్షుడు హరీష్, రాము నాయక్, మండల యూత్ ప్రధాన కార్యదర్శి మార్గం వంశీకృష్ణ, ఎన్ ఎస్ యూ ఐ మండల అధ్యక్షుడు దేశ గాని హరగోపాల్ గౌడ్, సీనియర్ నాయకుడు పెంతల సూరి,ఉప్పలయ్య, సుధాకర్ , స్వామి ,మల్లేష్, యాకిరెడ్డి, ఎల్లయ్య ,సోమనరసయ్య, వెంకన్న , ప్రశాంత్, అజయ్, మందుల బుచ్చమ్మ ,వెంకన్న, నరేష్ రెడ్డి ,బాలు ,కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version