`సంపద చిచ్చు…బిజేపి ఉచ్చు!?

`తెలంగాణలో సింగరేణి, ఆంధ్రాలో స్టీల్‌ ఫ్యాక్టరీ.

`దక్షణాది ఆస్థులు ఉత్తరాధి వ్యాపారులకు పంపకం?

`కేంద్ర పెద్దల ఇష్టులకు దారాధత్తం?

`ఉత్తరాధి వ్యాపారులకు దక్షణాది ఆస్థలు పలహారం?

`ప్రైవేటు పరంతో ఉత్తరాధి ఆధిపత్యం.

`దక్షిణాదిలో రాజకీయ, వ్యాపార గుత్తాధిపత్యం. 

`తెలుగు వారి ఐక్యత లోపంలో తోడుతున్న అగాధం?

`ఒకరి అభ్యున్నతి మరొకరికి కంటగింపు విఘాతం?

`రాజకీయ ఏకత్వం తెలుగు ప్రజల దరి చేరితే బిజేపికి కష్టం?

`తెలుగు రాష్ట్రాల దూరమే బిజేపికి వరం?

`దక్షణాది ఐక్యతలో లుకలుకలు బిజేపికి అవసరం?

`పెరుగు విషయంలోనే కనిపించిన ఐక్యత కలవరం?

`సంపద విషయంలో ఒకటైతే బిజేపికి కలత?

`రాజకీయంగా తెలుగు రాష్ట్రాలు బిజేపికి భవిష్యత్తుకు నలత?

`బలమైన తెలుగు శక్తి నిర్వీర్యం కోసం బిజేపి ఎత్తుగడ?

`బిఆర్‌ఎస్‌ బలపడితే దక్షణాన బిజేపి ఆటలకు అడ్డుకట్ట?

హైదరబాద్‌,నేటిధాత్రి: 

ఊరందరిదీ ఒకదారైతే ఉలిపిరి కట్టేది ఒక దారి అని సామెత. దేశ రాజకీయాలలో భారతీయ జనతాపార్టీది అలాంటి పరిస్ధితే కనిపిస్తోంది. దేశ ప్రజలు ఎంతో నమ్మకంతో రెండుసార్లు పూర్తి మెజారిటీ అందించి పాలించమంటే సంక్షేమం అమలు చేయమనా? లేక ప్రభుత్వ రంగ ఆస్ధులు అమ్మకాలకు పెట్టమనా? అన్నదానిపై చర్చ చర్చ జరగాల్సిన అవసరం వుంది. స్వాంతంత్య్రానికి పూర్వం ఏం జరిగింది? ఆ సమయంలో ఏం జరిగింది? అన్నదానిపై నిర్ణయాలు చేయడానికి ఇది సరైన సమయంకాదు? అప్పటి పరిస్దితులను అధ్యయం చేసి సాధించేదేమీ వుండదు? దేశ ప్రజల మనోభావాలతో ఆటలాడుకోవడం, ప్రజల మధ్య దూరం పెంచడం, మనుషుల మధ్య చిచ్చు రేపడం తప్ప మరొకటి వుండదు. అప్పటి కాల మాన పరిస్దితులలో ప్రజల సమ్మతంతోనే జరిగింది. ఇప్పుడు ఏ సమ్మతితో ప్రజలు బిజేపిని ఆదరిస్తున్నారో? అప్పుడు కూడా ప్రజలు అదే ఆదరణతో అప్పటి పార్టీలను, పరిస్దితులను ఆహ్వానించారు. ఇక వేళ ఆ సమయంలో ఎంతో కొంత బలంగా జనసంఘన్‌ను దేశ ప్రజలు ఎందుకు అక్కున చేర్చుకోలేదు. ఎందుకు ఆదరించలేదు. ఎందుకు ఎన్నికల్లో వారికి పట్టం కట్టలేదు? అంటే అప్పటి ప్రజల ఆలోచనలు వేరు. అప్పటి త్యాగాలను చూసిన ప్రజల నిర్ణయం అది. ఆ సమయంలో జరిగిన ప్రతి విషయాన్ని డెబ్బై ఏళ్ల తర్వాత తప్పు పట్టడం అంటే ప్రజలనే బిజేపి తప్పుపట్టడమౌతుందే? గాని అప్పటి పాలకులను కాదు? ముందు బిజేపి ఈ విషయం తెలుసుకోవాలి? ఎంత సేపు పూర్వపు రోజులను బూచిగా చూపించి ఎన్నికలకు వెళ్లాలి. అధికారంలోకి రాగానే ప్రభుత్వ రంగ సంస్ధలు ప్రైవేటు వ్యక్తులకు పలహారం చేయాలి? ఇదేనా బిజేపి అనుసరిస్తున్న విధానం అని దేశమంతా ప్రశ్నిస్తోంది? ప్రతిపక్షాలన్నీ నిలదీస్తున్నాయి. ఒకనాడు ఖాయిలా పడ్డ పరిశ్రమలను ప్రైవేటు పరం చేయడం అంటే ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్య సంస్ధలను మాత్రమే విక్రయించారు. అంతే కాని పూర్తి ప్రభుత్వ రంగ సంస్ధలను, విజయవంతంగా నడుస్తున్న సంస్ధలను ప్రైవేటు వ్యాపారులకు దారాధత్తం చేయలేదు. పైగా అదే మా విధానమని ఏ ప్రభుత్వం అంత మొండిగా చెప్పలేదు. దేశ ప్రజలు బిజేపి ప్రభుత్వం పెంచుతున్న ధరలను, వేస్తున్న పన్నులను, భారాలను మోస్తున్నారన్న భ్రమల్లో బిజేపి నేతలన్నారా? ప్రజలు ప్రశ్నించడం లేదు?

తిగబడడం లేదంటే సమ్మతిస్తున్నారని అనుకుంటున్నారో? అర్ధం కావడంలేదు. ఏది ఏమైనా ప్రజల మీద తీవ్ర ఒత్తిడి అన్నది ఎప్పుడూ మంచిది కాదు. ప్రశ్న బతికిన సమాజంలోనే సమసమాజం వెల్లివిరిస్తుంది. అసలు తమను ప్రశ్నించొద్దు? మేం ఏం చేసినా విమర్శించొద్దు? అన్న దోరణి ఏ రాజకీయ పార్టీకి మంచిది కాదు. 1975 ఎమర్జెన్సీ మీది జరిగిన తిరుగుబాటు పునాదుల మీద నిర్మాణమైన బిజేపి అదే దారిలో నడవడం అంటే తన పతనాన్ని తానే కోరుకోవడం అవుతుంది. ప్రజలు నమ్మినంత వరకే ఏ రాజకీయ పార్టీకైనా మనుగడ. ప్రజల శ్రేయస్సును గాలికి వదిలేసిన రాజులే చరిత్రలో చోటు సంపాదించుకోలేదు. అలాంటిది ప్రజాస్వామ్య వ్యవస్ధలో ప్రజల సంక్షేమం కాంక్షించకపోతే రాజకీయ పార్టీలకు పుట్టగతులుండవు. నాయకుల స్ధ్వార్ధ ప్రయోజనాలు దేశ సందను కొల్లగొట్టేదాకా వెళ్లొద్దు. దేశమంతా ఇదే మాట చెబుతోంది. కాని వినిపించుకోడం మా విధానం కాదనుకుంటే, తప్పించడం మా విధానమని ప్రజలు సమయం వచ్చినప్పుడు పక్కన పెడతారు. అప్పుడు ఆత్మావలోకనం చేసుకున్నా, ఆత్మపరిశీలన చేసుకున్నా, ఎక్కడ లోపం జరిగిందని చర్చించుకున్నా లాభం ఏమీ వుండదు. ఇప్పటికే ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పదేళ్ల క్రితం నాలుగువందలు వున్న సిలెండర్‌ ఇప్పుడు 1200లకు చేరింది. ఇలా చెప్పుకుంటూ పోతే ధరల మోత సామాన్యుడి నడ్డి విరిస్తోంది. ఎంత సేపు మత రాజకీయాలు తప్ప, మానవత్వం విలువలు మాయమైన రాజకీయాలు చేస్తామంటే ప్రజలు కూడా ఒప్పుకోరు. అంతే కాదు ఎంత సేపు హైందవ సమాజ మేలు కోసం, దేశం కోసం, ధర్మం కోసం అంటూ సాగించే బిజేపి రాజకీయాల్లో దేశంలో ధరల మోత మోసేందంతా హిందూ ప్రజలే మర్చిపోవద్దు? అఖండ భారతా వని అనే మాట పదే, పదే మాట్లాడేవారు ఇతర మతాలను కడుపులో పెట్టుకొని చూసుకునేలా వుండాలి. అంతే కాని శివమైతే మాకు, శవమైతే మీకు అన్న ధోరణి సామరస్యానికి విఘాతమౌతుంది.

  ఇదిలా వుంటే ఇటీవల తెలుగు రాష్ట్రాల సంపదను ఉత్తరాధి వ్యాపారులకు దారాధత్తం చేయడాన్ని భారత రాష్ట్ర సమితి తీవ్రంగా ఆక్షేపిస్తూ వస్తోంది. 

 ఉభయ తెలుగు రాష్ట్రాలలో రాజకీయాలను బిజేపి తన గుప్పిట్లో పెట్టుకొని,నేతల నోరు నొక్కే ప్రయత్నం జరుగుతోందన్నది ప్రధాన వాదన. ఆంద్రుల హక్కు, విశాఖ ఉక్కు అన్న నినాదంతో మొదలైన విశాఖపట్నం ఉక్కు పరిశ్రమ ఏర్పాటు ప్రకనటకే కొన్ని దశాబ్దాలు పట్టింది. ఆ ప్రకటన తర్వాతా దాని నిర్మాణానికి కూడా దశాబ్దాలు పట్టింది. ఆఖరకు తెలుగు ప్రధాని పి.వి. నర్సింహారావు చేతుల మీదుగా ఎంతో సంతోషంగా ప్రారంభించుకొని, పరిశ్రమ సాధించుకున్నంత కాలం కూడా పని చేయకుండానే ప్రైవేటు పరం చేస్తామనడం న్యాయమా? ఇదే తెలుగు ప్రజల తరుపున తెలంగాణ ముఖ్యమంత్రి, భారత రాష్ట్ర సమితి అధినేత కేసిఆర్‌ ప్రశ్నిస్తున్నారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై గుర్రుగా వున్న ప్రజలనుంచి తీవ్ర నిరసన రాకుండా వుండేందుకు ముందు నిర్వహణ బాధ్యత ప్రైవేటు వ్యక్తులకు ఇస్తున్నామన్న సాకును కేంద్రం చెప్పడంలోనే కుట్ర దాగి వుంది. ఇదే తెలుగు ప్రజలు వ్యక్తం చేస్తున్న ఆందోళన. దానికి ఆజ్యం పోసేలా తాగాజా కూడా కేంద్రం విశాఖ స్టీల్‌ అమ్మకం విషయంలో వెనకడుగు లేదని తేల్చడం కూడా తెలుగు ప్రజల్లో ఆందోళన రేకెత్తుతోంది. కాని ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో వున్న వైపిసి స్పందనలేదు. తెలుగుదేశానికి పట్టింపు లేదు. జనసేన నుంచి ఇప్పటి వరకు ఒక్క ప్రకటన లేదు. అంటే ఆంద్రుల హక్కు అని పోరాడి, ఎంతో మంది ప్రాణాలొడ్డి సాధించుకున్న విశాఖ స్టీల్‌ను తమ రాజకీయ ప్రయోజనాల కోసం తాకట్టుపెడుతున్న సీమాంధ్ర పార్టీల కళ్లు తెరిపించే ప్రయత్నం కేసిఆర్‌ చేశారు. అయినా వారిలో ఎలాంటి చలనం లేదు. ఎందుకంటే నిద్రపోయేవారిని లేపొచ్చు. కాని నిద్ర నటించేవారిని లేపలేము? సీమాంధ్రలోని అన్ని పార్టీలకు బిజేపి రక్షణ కావాలి. అండా దండ కావాలి. వారు గెలిచేందుకు ఆ పార్టీ తోడు కావాలి. మొత్తంగా ఆ మూడు పార్టీలకు కేంద్ర పెద్దల ఆశీస్సులు కావాలి. అంతే కాని ప్రజల ఆకాంక్షలతో వారికి పనిలేదు? ఇదేనా రాజకీయం? తెలంగాణలో సింగరేణిలోని నాలుగు బ్లాక్‌లను ప్రైవేటు పరం చేయాలని కేంద్రం చూస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. సింగరేణి పర్యవేక్షణ రాష్ట్ర ప్రభుత్వం చేతిలోనే వుండాలని వాదిస్తోంది. అలాగే విశాఖ ఉక్కు ప్యాక్టరీ నిర్వహణ కోసం కూడా ముందుకు వస్తామని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. అయినా ఆంధ్రప్రదేశ్‌ లోని రాజకీయ పార్టీలు బిఆర్‌ఎస్‌తో కలిసి రావడం లేదు? పైగా బిఆర్‌ఎస్‌ ఆ రాష్ట్రానికి చేయాలనుకుంటున్న మేలు కూడా ఆ పార్టీలకు నచ్చడం లేదు. ఇలా ప్రజల మధ్య , రాష్ట్రాల మధ్య ఐక్యతా లేమి మూలంగానే బిజేపి మరింత బలపడుతోందన్నది ఇప్పటికైనా రాజకీయ పార్టీలు తెలుసుకోవాలి. ఇటీవల పెరుగు ప్యాకెట్లపై హిందీలో పేరు వుండాలన్న కేంద్రం ఒత్తిడిని అటు కర్ణాటక, ఇటు తమిళనాడు తీవ్ర స్ధాయిలో నిరసన వ్యక్తం చేశాయి. అక్కడి రాజకీయ పార్టీలు ఒక్కమాట మీద నిలబడ్డాయి. కేవలం పెరుగు ప్యాకెట్ల మీద పేరు మీద మీదనే ఇంత ఐక్యత కనబర్చితే, తెలుగువారి హక్కు, సొత్తు, ఆత్మ గౌరవమైన విశాఖ ఉక్కు జోలికి వస్తే ఎందుకు స్పందించడం లేదో? ఆయా పార్టీలే ప్రజలకు సమాధానం చెప్పాలి?

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version