భద్రాచలం నియోజకవర్గ అభివృద్ధికి 14 కోట్ల 50 లక్షలకు మంజూరు
జీవో.జారీ చేసిన స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణ రావు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటి ధాత్రి
భద్రాచలం టౌన్.మాజీ ఎం. ఎల్. సి.,భద్రాచలం నియోజకవర్గ ఇంచార్జీ బాలసాని లక్ష్మీ నారాయణ ఇటీవల ముఖ్యమంత్రి ని కలిసి భద్రాచలం నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి కొరకు నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. స్పందించిన ముఖ్యమంత్రి కెసిఆర్.వెంటనే సమగ్ర నివేదిక పంపవలసిందిగా కోరారు. నివేదిక అందిన వెంటనే నేడు 14కోట్ల 50 లక్షల రూపాయలకు పరిపాలన పరమైన అనుమతులు ఇచ్చారు. బాలసాని లక్ష్మి నారాయణ గారి అభ్యర్ధన మేరకు ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు తన్నీరు హరీష్ రావు కృషి మేరకు నిధులు మంజూరు చేసినందుకు ముఖ్యమంత్రి కెసిఆర్ కి ధన్యవాదాలు తెలిపారు.