బీసీ రుణాలు రాజకీయ ప్రమేయం లేకుండా రజక వృత్తిదారులకు వెంటనే అందించాలి

తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం మండల అధ్యక్షులు చిట్యాల సమ్మయ్య

పాలకుర్తి నేటిధాత్రి

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన లక్ష రూపాయల బిసి రుణాలు రాజకీయ ప్రమేయం లేకుండా రజక వృత్తిదారులకు వెంటనే అందించాలని తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం మండల అధ్యక్షులు చిట్యాల సమ్మయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం పాలకుర్తి మండల కేంద్రంలో రజక వృత్తిదారుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి చిట్యాల ఎల్లయ్య అధ్యక్షత వహించగా వారు పాల్గొని మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బీసీ బందు అప్లై చేసుకొని రోజులు గడుస్తున్నప్పటికీ ప్రభుత్వం అర్హులకు అందించకపోవడం లో ఆంతర్యం ఏమిటి అని వారు ప్రశ్నించారు. అప్లై చేసుకున్న అర్హులందరికీ వెంటనే అందించాలని 50 సంవత్సరాలు నిండిన ప్రతి రజకునికి పెన్షన్, డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇవ్వాలని. రజకులకు అట్రాసిటీ చట్టం చేయాలన్నారు.సొంత ఇంటి జాగా ఉండి ఇల్లు నిర్మించుకునే పేదలు గృహలక్ష్మి పథకం కోసం ఈ నెల 10లోపే దరఖాస్తు చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం గడువు విధించిందని తెలిపారు. ఈ గడువు సరిపోదని దీని ఫలితంగా కొంతమంది అర్హులు ఈ పథకానికి దూరమయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. కాబట్టి దరఖాస్తు గడువు మరో 15 రోజుల వరకు పొడిగించాలని ఎలాంటి అవినీతి అక్రమాలకు తావు లేకుండా పారదర్శకంగా ఈ పథకాన్ని అమలు చేయాలని మొదటి విడత గృహలక్ష్మి పథకం ద్వారా ప్రతి నియోజకవర్గానికి 3,000 ఇండ్లు మంజూరు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించిందని అయినప్పటికీ మార్గదర్శకాల్లో పేర్కొన్న కొన్ని అంశాల కారణంగా కొంత మంది అర్హులు దూరమవుతున్నారని ఎన్నికల ముందు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లకు ఐదు లక్షల ఇస్తానన్న హామీని మూడు లక్షలకు కుదించడం వల్ల పేదలకు ఇంటి నిర్మాణం భారంగా మారిందన్నారు. అర్హులందరికీ ఈ పథకంలో అవకాశం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో చిట్యాల సోమయ్య, చిట్యాల వెంకన్న, చిట్యాల సురేష్, మచ్చ ఎల్లయ్య, మచ్చ సంపత్, మచ్చ సోమయ్య, చిట్యాల రాములు, సరిత, శారద ఎల్లమ్మ, చిట్యాల అనిల్, చిట్యాల యాకయ్య, దూది గాని వెంకన్న, సాంబరాజు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version