పాలకుర్తి నేటిధాత్రి
పాలకుర్తి మండల కేంద్రంలోని రాజీవ్ చౌరస్తాలో పాలకుర్తి మండల పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ‘ఛలో కోరుట్ల పద్మశాలి రాజకీయ యుద్దభేరి’ సభ పోస్టర్స్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పాలకుర్తి మండల పద్మశాలి సంఘం అధ్యక్షుడు మాచర్ల సారయ్య, మండల ప్రధాన కార్యదర్శి పెనుగొండ రమేష్ లు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో పద్మశాలీల ఆత్మగౌరవం కోసం బీసీలలో అత్యధిక జనాభా కలిగిన పద్మశాలీలకు గుర్తింపు, గౌరవం, సమన్యాయం కోసం పద్మశాలీల రాజ్యాధికార సాధన కోసం చలో కోరుట్ల కార్యక్రమం చేపట్టడం జరిగిందని, ఈ సభను పద్మశాలీలు విజయవంతం చేయాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఎక్కువ త్యాగాలు చేసి అత్యధికంగా నష్టపోయిన కులం పద్మశాలి కులం అని సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం కోసం పద్మశాలీలు ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైందని అందుకే చలో కోరుట్ల సభను నిర్వహించడం జరుగుతుందని, ఈ యొక్క సభకు అతిరథ మహారథులు విచ్చేస్తున్నారని పద్మశాలి కుల బాంధవులు విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ పద్మశాలి విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మేడారపు సుధాకర్ నేత, మండల కోశాధికారి కూరపాటి సుదర్శన్, మండల నాయకులు దేవసాని కృపాకర్, పద్మశాలి మండల నాయకులు చక్రాల రఘు, చిలుకమారి సోమేశ్వర్, వైట్ల రామ్మూర్తి, మాచర్ల అనిల్, ఈగ శ్రీను, పోగు చిరంజీవి, రాపోలు తిరుపతి లు పాల్గొన్నారు.