పెండింగులో ఉన్న ఫీజురియంబర్స్మెంట్,స్కాలర్ షిప్స్ విడుదల చేయాలి

పిడిఎస్యు డివిజన్ కమిటీ అధ్వర్యంలో ఆర్డీవో కార్యాలయంలో వినతిపత్రం

నర్సంపేట,నేటిధాత్రి :
గత కొన్ని సంవత్సరాలుగా పెండింగులో ఉన్న ఫీజురియంబర్స్మెంట్,స్కాలర్ షిప్స్ ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని పిడిఎస్యు నర్సంపేట డివిజన్ కార్యదర్శి గుర్రం అజయ్ డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా నెలకొన్న విద్యారంగ సమస్యలను పట్టించుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం తాత్సారం చేస్తోందని, దానిలో భాగంగానే గత మూడు సంవత్సరాలుగా విద్యార్థులకు రావలసిన ఫీజు రియంబర్స్మెంట్ ఉపకార వేతనాల బకాయిలను చెల్లించడం లేదని తెలిపారు. తక్షణమే రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న 5,500 కోట్ల బకాయిలను విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే జూనియర్, డిగ్రీ కళాశాలలకు పక్కా భవనాలు నిర్మించాలని కోరారు. ఎస్సీ ఎస్టీ బిసి విద్యార్థులకు వసతి గృహాలలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలన్నారు. అదేవిధంగా సొంతభవనాలు లేక అద్దె భవనాల్లో ఉండడం ద్వారా విద్యార్థులకు సరైన వసతుల లేక విద్యకు దూరమయ్యే పరిస్థితి ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తంచేశారు. కావున జిల్లా వ్యాప్తంగా విద్యా రంగంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించలని. లేనియెడల అనేక పోరాటాలకు సిద్ధంకావాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు.అనంతరం ఆర్డీవో కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ కోశాధికారి రవి, విజయ్,బాలక్రిష్ణ, దిలీప్,శివాజీ,వివేక్,పవన్, తదితర విద్యార్థులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version