పివైఎల్ గ్రామ కమిటీ ఏకగ్రీవంగా ఎంపిక

గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి :
ప్రగతిశీల యువజన సంఘం( పీవైఎల్) గుండాల మండల కమిటీ ఆధ్వర్యంలో సోమవారం రాత్రి మఠంలంక గ్రామ యువకులతో గ్రామ మహాసభ జరిపి నూతన గ్రామ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. గ్రామ కమిటీ అధ్యక్ష, కార్యదర్శులుగా కుంజ నరేష్, కుంజ శేఖర్ లతో పాటు తొమ్మిది మంది గ్రామ కమిటీ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకొన్నారు. ఈ మహాసభలో పీవైఎల్ జిల్లా కార్యదర్శి వాంకుడోత్ అజయ్, సిపిఐ(ఎంఎల్) ప్రజాపందా జిల్లా నాయకులు శంకర్, పి వై ఎల్ మండల కార్యదర్శి పూనెం మంగయ్య లు మాట్లాడుతూ నీళ్లు, నిధులు, నియమాకాల పేరుతో కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో బిఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడంలో ఘోరంగా విఫలమైందని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రంలో 40 లక్షల మంది నిరుద్యోగ యువకులు ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్నారని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం సంవత్సరానికి లక్ష ఉద్యోగాలు, కేంద్రంలో బిజెపి ప్రభుత్వం సంవత్సరానికి కోటి ఉద్యోగాలు భర్తీ చేస్తామని ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోగా నిరుద్యోగ భృతి కల్పించకపోవడం సిగ్గుచేటు అన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పాలకులు ఇచ్చిన హామీలను నేటి యువతరం అడుగడుగునా ప్రశ్నించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ (ఎంఎల్) ప్రజాపందా మండల నాయకులు కోడూరి జగన్, పార్టీ గ్రామ నాయకులు కుంజ రమేష్, కుంజ పాపయ్య, కుంజ రాంబాబు ,పీ వై ఎల్ నాయకులు కల్తీ వెంకటేశ్వర్లు, కుంజ కిషోర్, ప్రవీణ్,నాగేష్, సురేష్, నర్సింహారావు, తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version