శాయంపేట నేటి ధాత్రి:
హన్మకొండ జిల్లా శాయంపేట మండలంలోని సూర్యనాయక్ తండా గ్రామంలో మంగళవారం నాడు ఘనంగా సీత్ల పండుగ జరుపుకోవడం జరిగిందని సర్పంచ్ భూక్య రమేష్,గ్రామం పెద్ద మనిషి బానోతు మోగిలి తెలిపారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ సీత్ల పండుగ లో భాగంగా గిరిజనుల ఆరాధ్యదైవమైన సీత్ల భవాని దేవతలకు నైవేధ్యలు సమర్పించి పాడి పంటలు,పిల్లా పాపలను చల్లగా చూడలంటూ మొక్కులుచెల్లించుకున్నారు.ప్రతి ఏటా ఆషాడం చివరి నుంచి శ్రావణం ముగిసే దాక ఈ ఉత్సవాలను నిర్వహిస్తామని తెలిపారు.ఈ సందర్భంగా మహిళలు సంప్రదాయ నృత్యాలు చేశారు.తండాలో పెద్ద మనుషులంతా కలిసి ప్రతి సంవత్సరం ఆషాఢ మాసం మంగళవారం నాడు సీట్ల పండుగను జరుపుకోవడం ఆనవాతిగా వస్తుందని తెలిపారు.
సిత్ల పండుగ అంటే
లంబాడీలు వారి సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతిగా నిలిచే పండుగ సీతల పండుగ. ఈ పండుగ లంబాడీలలో మొదటి పండుగ. ఈ పండుగలో భాగంగా తండాల పొలిమేర కూడలి దగ్గర సీట్ల భవానిని ప్రతిష్టిస్తారు. పురుషులంతా డప్పు, వాయిద్యాలతో వాయిస్తూ నృత్యం చేసుకుంటూ మేకలు,గొర్రెలతో మహిళలు,యువతులు బోనాలు ఎత్తుకొని నృత్యాలు చేసుకుంటూ సిత్ల భవానీ ని ప్రతిష్ఠించిన ప్రదేశానికి వెళ్తారు.ఈ క్రమంలో అందరూ పాటలు పాడతారు.గొర్రెలు మేకలను బలి ఇచ్చి,సిత్ల భవానీకి పూజలు చేసి,నైవేద్యం సమర్పిస్తారు.ఆలా చేయడం వలను పాడి పంటలు పుష్కలంగాపండలని,గ్రామంలో ని ప్రజలు ఎలాంటి రోగుల బారిన పడకుంట ఉంటారని బంజారా ల నమ్మకం.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు రవీందర్, మాజీ ఉప సర్పంచ్ లక్ష్మాన్ నాయక్,రామన్,లచ్చు నాయక్,మాలోతు రాజు,గిరిజన రాష్ట్ర నాయకులు లింగు నాయక్,మోహన్,అజ్మీర రఘు,కృష్ణ,గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు