అక్రమాలపై విచారణకు ఆదేశం

` రెండు మూడు రోజుల్లో విచారణ పూర్తి చేస్తాం : కమీషనర్‌ శేషాద్రీ 

` కదలనున్న అక్రమాలకు డొంక

` విచారణాధికారి చేతిలో అక్రమార్కుల భవిష్యత్‌

` భాదితులను విచారిస్తారా లేక మమ అనిపిస్తారా..?

` కీలక ఆధారాలు మాయం చేసే దిశగా అక్రమార్కుల అడుగులు

` అక్రమాల ఆధారాల ఫైల్‌ అక్రమార్కుల చేతికి..?

` రాష్ట్ర వ్యాప్తంగా రిజిస్ట్రార్ల కార్యాలయాల్లో సంచలనమౌతున్న వరుస కథనాలు

` న్యాయం చేయకపోతే పోరాటం తప్పదంటున్న భాదితులు 

రిజిస్ట్రేషన్‌ శాఖలో నకిలీ చలాన్ల అక్రమాలపై ఉన్నతాధికారులు దృష్టి సారిస్తున్నారు. గత కొంతకాలంగా రిజిస్ట్రేషన్‌ శాఖలో పలు ప్రాంతాల్లో కొందరు అధికారుల చేతుల్లో మోసపోయి అనే ఇబ్బందులను ఎదుర్కోంటున్న స్టాంప్‌ వెండర్స్‌ నేటిధాత్రిని ఆశ్రయించి తమ గొడును వెల్లబోసుకున్నారు. ఈ క్రమంలో వారి అనుభవిస్తున్న భాదలను అందుకు కారకులైన అధికారులపై నేటిధాత్రి గత కొంత కాలంగా వరుస కథనాలు ప్రచురిస్తున్నది. దీంతో రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులు ఈ కథనాలకు స్పందించి వాస్తవ విషయాలను తెలుసుకునే పనిలో పడ్డారు. అక్రమాలు చేసినట్లు అధికారులపై వస్తున్న కథనాలపై సమగ్ర విచారణ జరిపే విధంగా కొందరు అధికారులకు ఇప్పటికే శాఖ ఉన్నతాధికరి ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. అధికారం చేతిలో ఉందని రెచ్చిపోయి అమాయకపు వెండర్స్‌ నుండి లక్షల రూపాయలు దండుకుని దర్జాగా తిరుగుతూ మాకేమౌతుందిలే అని తిరుగుతున్న అధికారుల బాగోతం బట్టబయలయ్యే సమయం అసన్నమవ్వడంతో అక్రమాధికారులు ఇప్పటికే హైదరాబాద్‌లో మకాం వేసి విధులు నిర్వహిస్తున్న కార్యాలయాలకు రావడానికి జంకుతున్నారని విశ్వసనీయ సమాచారం. 

` కదలనున్న అక్రమాలకు డొంకనకిలీ బాగోతం బయట పడిరది కొన్ని ప్రాంతాల్లోనే అయినా ఈ తతంగం రాష్ట్ర వ్యాప్తంగా జరిగినట్లు కేసుల పాలైన భాదితులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ అంశానికి సంబంధించి వివాదం జరిగిన సమయంలో చాలా మంది అధికారులు అప్పటికప్పుడు వెండర్స్‌ నోరు నొక్కి, బెదిరింపులకు , బుజ్జగింపులకు దిగి బయటకు రాకుండా చూసుకున్నారనే ఆరోపణలు లేకపోలేదు. అయితే ప్రస్తుతం ఉమ్మడి కరీంనగర్‌ సహా కొన్ని ప్రాంతాల్లో విధులు నిర్వహించి అక్రమాలకు పాల్పడిన అధికారుల బాగోతాన్ని విచారణ చేసే క్రమంలో మరింత మంది అధికారుల అక్రమాలు, నష్ట పోయిన భాదితుల వివరాలు బయటకు వచ్చే అవకాశాలు లేకపోలేదని రిజిస్ట్రేషన్‌ శాఖలో గుసగుసలు వినవస్తున్నాయి. దింతో ఇప్పటికే అక్రమాలకు పాల్పడిన అధికారులు తమ ఉన్నతాధికారుల్లో కొందరిని కలిసి తమ చుట్టూ ఎలాంటి వివాదాలు చేరకుండా చూడాలని కోరేందుకు అధికారుల దర్శనం కొరకు పడరాని పాట్లు పడుతున్నారట. దాంతో పాటు ఎంతోమంది అక్రమాలకు అండగా నిలిచిన అధికారిపైనే వార్తలు వచ్చి విచారణ జరిగే అవకాశం ఉండడంతో ఆయన అండతో రెచ్చిపోయిన అధికారులు తమ బాగోతం బట్టబయలౌతుందేమోనని లబోదిబోమంటున్నారు.

` భాదితులను విచారిస్తారా లేక మమ అనిపిస్తారా..?

రిజిస్ట్రేషన్ల శాఖలో అక్రమాలు వెలుగు చూడాలంటే కీలకంగా ఉన్న అధికారుల భాదితులను ఈ విచారణలో భాగస్వామ్యులను చేస్తేనే పూర్తి విషయాలు బయటపడే అవకాశం ఉంది. కాబట్టి భాదితులను వివరాలను సంబంధిత శాఖ ఉన్నతాధికారులు సేకరించి వారిని అత్యంత గోప్యంగా విచారణ చేసి అక్రమ అధికారులకు చిక్కకుండా తగిన రక్షణ కల్పించి విచారణ పూర్తి చేయగలిగితే అనేక మంది భాదితులకు న్యాయం జరగడంతో పాటు కోట్లాది రూపాయల అక్రమాలు బయటపడతాయి. దాంతో పాటు ప్రభుత్వ వ్యవస్థల్ని తమ సొంత వ్యవస్థలుగా వ్యవహరించి అక్రమాలకు పాల్పడిన అధికారులకు తగిన బుద్ది చెప్పినట్లు అవుతుందని భాదితులు , ప్రజలు అంటున్నారు. అయితే ఇదే శాఖలో ఉండే ఉన్నతాధికారులకు ఈ అక్రమాలకు పాల్పడిన వారికి గతంలో మంచి పరిచయాలు ఉన్నాయనే ఆరోపణలు ఉన్న నేపథ్యంలో కీలకంగా ఉన్న భాదితులను విచారణలో భాగస్వామ్యులను చేస్తారా లేక విచారణను మమ అనిపించి అన్యాయం చేస్తారా..? అనేది చూడాలి మరి. 

 ` అధికారుల అక్రమాలకు భాద్యులమై క్షోభ అనుభవిస్తున్నాం డబ్బులు డీడీ కట్టి మేషిన్‌ లోడ్‌ చేసుకునే వెండర్స్‌ ను కొందరు అధికారులు తప్పుడు పద్ధతిలో డబ్బులను చెల్లించడానికి చలాన్లు ఇవ్వకుండా వెండర్స్‌ దగ్గర నుండి నగదును తీసుకుని మాకు మేషిన్‌ లోడ్‌ చేసి ఇచ్చారు. వాటిని మేము అధికారుల మీద భరోసాతో నాలుగు సంవత్సరాలు ఈ పద్ధతినే కొనసాగించాం. 2014లో నకిలీ చలాన్లు పెట్టినట్లు కార్యాలయం నుండి కాల్‌ వచ్చింది. తర్వాత ఈ విషయంపై జరిగిన విచారణలో కూడా మమ్మల్సి సంప్రదించకుండానే విచారణ పూర్తి చేశారు. దాంతో మాపై కేసులు నమోదయ్యాయి. అందుకు కారకులైన అధికారులను వదిలేశారు. ఈ వివాదం వలన కుటుంబాన్ని రోడ్డు పాలు చేసుకున్నాం. ఈ కేసు వలన చేయని తప్పుకు జైల్‌ జీవితాన్ని గడపడమే గాక కనీసం విదేశాల్లో ఉన్న మా కూతురును చూడలేక మానసికంగా క్షోభ అనుభవిస్తున్నాం. ఉన్నతాధికారులు ఈ విషయాన్ని క్షుణ్ణంగా విచారించి తమకు జరిగిన నష్టాన్ని , అధికారులు చేసిన అక్రమాలను గుర్తించి మాకు నష్టపరిహారం అందించడంతో పాటు కేసుల నుండి ఉపశమనం కల్పించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం.

ఓ భాదితుడు , పూర్వపు కరీంనగర్‌ జిల్లా ( పెద్దపల్లి జిల్లా )

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version