> ఎమ్మెల్యే డాక్టర్ చర్లకొల్ల లక్ష్మారెడ్డి,
మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి
జడ్చర్ల మున్సిపాల్ పరిది 10 వ వార్డ్ లో శ్రీ పోచమ్మ దేవాలయం లో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, దేవాలయం దగ్గర నూతన సీసీ రోడ్డు నిర్మాణ పనులకు జడ్చర్ల ఎమ్మెల్యే డాక్టర్,చర్లకొల్ల లక్ష్మారెడ్డి, శంకుస్థాపన చేశారు, ఈ కార్యక్రమంలో జడ్చర్ల మున్సిపాల్ ఛైర్పర్సన్ శ్రీమతి దోరేపల్లి లక్ష్మీ రవీందర్, కమిషనర్ మహమూద్ షేక్ , వార్డు కౌన్సిలర్ కుమ్మరి రాజు , మున్సిపాల్ కౌన్సిలర్, మూఢ డైరెక్టర్స్, ఎ ఎం సి,డైరెక్టర్స్, వార్డు సభ్యులు, వార్డు మహిళలు, బీ, ఆర్, ఎస్, పార్టీ సీనియర్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.