గణపురం నేటి ధాత్రి
జయశంకర్ జిల్లా గణపురం మండలం లోకేంద్రం లో ధర్మ సమాజ్ పార్టీ అధినేత డా.విశారదన్ మహారాజ్ అదేశాలమేరకు గణపురం మండలం కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రం లో ..7% లేని అగ్రకులాలు .7 రాజకీయ పార్టీలకు నాయకత్వం వహించడం ఏంటిఈ నాయకత్వం స్థానంలో 93% ఉన్న బీసీ ఎస్టీ ఎస్సీ చేతిలో పెట్టాలని డిమాండ్ ఈరోజు గణపురం సెంటర్ వద్ద ధర్మసమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ఏడు శాతం లేని అగ్రకులాలు 7 పార్టీలకు అధినాయకత్వం వహించడం ఏంటి 93 శాతం ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజలకు ఆ పార్టీల అధినాయకత్వాన్ని వారి చేతిలో పెట్టాలని డిమాండ్ చేస్తూ గణపురం సెంటర్లో తెలంగాణ రాష్ట్ర బీసీ, ఎస్సీ ,ఎస్టీల రాజ్యాధికార సాధన జేఏసీ , ఆధ్వర్యంలో అగ్రకుల రాజకీయ పార్టీల దిష్టిబొమ్మలు దహనం చేయడం జరిగింది. అనంతరం ధర్మసమాజ్ పార్టీ మండల ప్రచార కమిటీ సభ్యులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో 93% బీసీ, ఎస్సీ ఎస్టీలు ఉండగా7% లేని అగ్రకుల 7 రాజకీయ పార్టీలైన బిఆర్ఎస్ బిజెపి కాంగ్రెస్ సిపిఐ సిపిఎం టి జె ఎస్ వై ఎస్ ఆర్ టి పి ల వైఖరి పూర్తిగా సామాజిక న్యాయ సూత్రానికి భారత రాజ్యాంగ సమానత్వ భావనకి ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం అందుకే ఏడు పార్టీలు వైఖరిని ధర్మ సమాజ్ పార్టీ తీవ్రంగా నిరసిస్తూ, ఖండిస్తూ.7 డిమాండ్లను 15- 5 -2023న లేఖలు రాయడంతో పాటు బహిరంగ ప్రకటన ఇచ్చి 15 రోజుల గడువు ముగిసిన ఇంతవరకు ఈ పార్టీల వైఖరిని 93% బీసీ, ఎస్సీ, ఎస్టీల కు తెలియపరచలేదు. కనుక దానికి నిరసనగా ధర్మసమాజ్ పార్టీ మండల కేంద్రంలో ధర్నా నిర్వహించి పార్టీల వైఖరిని తెలియజేయాలని దిష్టిబొమ్మలు దహనం చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో గ్రామ గ్రామాన బీసీ, ఎస్సీ ,ఎస్టీ ప్రజలను అన్ని సామాజిక సంఘాల నాయకులతో ధర్మ సమాజ్ పార్టీకలిసి ఏడు శాతం ఉన్న అగ్రకుల రాజకీయ పార్టీలు చేస్తున్న ద్రోహాన్ని ప్రజల ముందు ఎండగట్టి వీరిని సామాజిక క్రిమినల్స్ గా ,సోషల్ టెర్రరిస్టులుగా ,ప్రజల ముందు దోషులుగా నిలబెడతామని ధర్మ సమాజ్ పార్టీ హెచ్చరిస్త ఉంది. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రచార కమిటీ సభ్యులు, కండె రవి , మండల ప్రచార కమిటీ కోగిల జితేందర్ కుర్రీస్వామి, ఇంజపెల్లివిక్రమ్, పోనగంటి సతీష్ దౌడు చంటి,శ్రీకరణ్, కండెరవి, తదితరులు పాల్గొన్నారు .
