వేసే ఓట్లక్కడ…అడిగే ఓట్లిక్కడ!

ప్రచారం అక్కడ…అన్న తరిమేస్తే నాటకం ఇక్కడ!

-తల్లీ కూతుళ్ల రాజకీయం.

-అన్నతో అధికారం పంచాయతీ…

-తెలంగాణలో అలజడికి 

-తెలంగాణ మాట రాదు.

-తెలంగాణ పాట పాడిరది లేదు.

-ప్రచారం కోసం బొనమెత్తినా కట్టూ, బొట్టు లేదు.

-తెలంగాణ ఆత్మగౌరవం తెలియదు.

-ఆధిపత్యం అన్ని వేళలా సాగదు.

-ప్రజాస్వామ్యం లో దౌర్జన్యానికి తావులేదు.

-అలా పోలీసులపై చేయిచేసుకున్న వారెవరూ లేరు.

-పెనుగులాటతో సానుభూతి పొందాలనుంటారు.

-షర్మిల మాత్రం దౌర్జన్యంతో రాజకీయం చేయాలనుకుంటున్నారు?

-విధి నిర్వహణలో వున్న పోలీసులను దుర్భాషలాడడం ఏ రాజకీయం?

-ప్రభుత్వ నిర్బంధం తప్పించుకోవడానికి మార్గాలు అనేకం వున్నాయి?

-ఉద్యమాల గడ్డ తెలంగాణలో అతి తెలివితేటలకు తావులేదు?

-తెలంగాణ ప్రశాంతంగా వుంది.

-లేని రాజకీయ అలజడి రేపకండి!

-జనం నమ్మడం లేదని షర్మిలకు ఎప్పుడో అర్థమైంది?

-ప్రచారం చేసి, ఓట్లేసి, గెలిపించిన ఆంధ్ర ప్రదేశ్‌ ఎందుకు వదిలేసినట్లు?

-అత్యాశకు కూడా హద్దుండాలి

-తెలంగాణలో రాజన్నకు తావులేదు? వారి వారసుల రాజకీయాలు ఎవరూ కోరుకోవడం లేదు?

-తెలంగాణ వ్యతిరేకి షర్మిలకు రాజకీయం చేసే నైతికత లేదు?

హైదరబాద్‌,నేటిధాత్రి: 

పాలివాడు,పాలి వాడు పంచాయితీ పెట్టుకుంటుంటే పక్కింటి వాడు పండగ చేసుకున్నాడట. షర్మిల వ్యవహారం అలావుంది. తెలంగాణ నేతల్లో, రాజకీయ పార్టీలలో బేధాభిప్రాయాలే తప్ప, కోపతాపాలు వుండదు. తెలంగాణ కోసం కొట్లాడిన వారందరిలో ఒక విజన్‌ వుంటుంది. విజన్‌ ప్రకారం వెల్లడం లేదన్న అసంతృప్తితో కొందరు తెలంగాణ వాదుల సూచనలే ఆరోపణలు. వాటిని తెలంగాణ ప్రభుత్వం మీద వ్యతిరేకత అనుకోలేం. తెలంగాణ సమాజం నుంచి ప్రభుత్వానికి వ్యతిరేకత ఎదురౌతుందని పగటి కలలు కని షర్మిల తెలంగాణ రాజకీయాల్లోకి వచ్చినట్లుంది. అదేదో సినిమాలో అన్నట్లు ఆక్రమించుకోవడం ఇష్టం, దోచుకోవడం ఇష్టం, లాక్కోవడం ఇష్టం అనే రాజకీయాలు తెలంగాణలో చేస్తానంటే కుదరదు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమాల పురిటి గడ్డ. ఈ గడ్డ మీద కుట్రలు, కుయుక్తులు, పన్నాగాలు పన్నిన వారు ఎవరూ చరిత్రలో స్ధానం సంపాదించుకోలేదు. తెలంగాణ సమాజం ముందు దోషులుగానే మిగిలిపోయారు. ఆఖరుకు షర్మిల తండ్రిగారైనా వైఎస్‌. రాజశేఖరరెడ్డి కూడా తెలంగాణ పచ్చి వ్యతిరేకి. తెలంగాణ ఉద్యమాన్ని ఏనాడు ఆయన గౌరవించలేదు. తెలంగాణ వాదులను నమ్మలేదు. అడుగడుగునా తెలంగాణ ఉద్యమాన్ని అణచివేయడానికి ప్రయత్నించాడు. తెలంగాణ ఉద్యమమే లేదని అప్పటి కాంగ్రెస్‌ అధిష్టానానికి నివేదికలు ఇచ్చాడు. తెలంగాణ కాంగ్రెస్‌ నాయకులను గుప్పెట్లో పెట్టుకున్నాడు. అయితే బెదిరింపులు, లేకుంటే కాంట్రాక్టుల పేరుతో బతుకు జీవుడా అని తెలంగాణ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు కూడా భయపడుతూ బతికేలా చేశాడు. ఇది అప్పటి నేతలు ఇప్పటికీ చెప్పుకునే మాట. అలాంటి తెలంగాణలో రాజకీయం కోసం, ప్రభుత్వాన్ని నిలదీయాలంటే అహంకారం పనికిరాదు. ఆవేశం అక్కర్లేదు. ఆలోచన వుండాలి. ప్రజలకు సేవ చేయాలన్న తలంపు వుండాలి. అంతే కాని పదవుల కోసమే వచ్చా, వచ్చేసారి నేనే ముఖ్యమంత్రిని అని చెప్పడమంటేనే షర్మిల రాజకీయ పరిణతి ఎంతో అర్ధం చేసుకోవచ్చు. అంతే కాకుండా తెలంగాణ పోలీసులతో షర్మిల వ్యవహరించిన తీరు ఆక్షేపనీయం. ఎవరూ సమర్ధించరు. తెలంగాణ వాదులెవరూ స్వాగతించరు. ఏ ప్రభుత్వమైనా శాంతి భద్రతల నేపధ్యంలో సమాజంలో అలజడి వుండకూడదని కోరుకోవడం సహజం. పద్నాలుగేళ్ల తెలంగాణ ఉద్యమంలో సీమాంధ్ర పాలకులు చేసిన దాష్టికాలు అన్నీ ఇన్నీ కావు. ఇప్పుడు కనీసం హౌజ్‌ అరెస్టు చేస్తున్నారు. కాని తెలంగాణ ఉద్యమంలో ఏకంగా పోలీస్‌ స్టేషన్లకు తీసుకెళ్లి రెండు మూడు రోజులు వుంచుకునేవారు. ధర్డ్‌ డిగ్రీ ప్రయోగించేవారు. ఉద్యమ కార్యాచరణకు ముందే బైండోవర్ల పేరుతో యువతను తీసుకెళ్లి పోలీసు స్టేషన్ల చుట్టూ తింపి, ఉద్యమంలో లేకుండాచేసేశారు. ఎంతో మంది తెలంగాణ నాయకులను కూడా చిత్రహింసలకు గురి చేసిన సందర్భం వుంది. అంతెందుకు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డిని విమర్శిస్తున్నాడని ఎంపి. రఘురామా కృష్ణం రాజుపై ధర్డ్‌ డిగ్రీ ప్రయోగించారు. ఓ డాక్టర్‌ ప్రభుత్వం మాస్కులు అందించడం లేదంటే నడి రోడ్డు మీద ఆయనను ఏం చేశారో ప్రజలే గమనించారు. అలాంటి పరిస్ధితులు ఆంధ్రాలో వుంటే…ఇక్కడ షర్మిల చిలకపలుకులు పలకడాన్ని ఎవరూ క్షమించరు. తెలంగాణ వాదులంతా మిలియన్‌ మార్చుకు పిలుపినిస్తే, ఎవరూ హైదరాబాద్‌కు రాకుండా పోలీసులు అడ్డుకుంటే తప్పించుకొని వచ్చి, హుస్సేన్‌ సాగర్‌లో పడవలపై మంత్రి హరీష్‌రావు లాంటి వారు ట్యాంక్‌ బండ్‌కు చేరుకున్నారు. అదీ నాయకుల లక్షణం. ఉద్యమ కార్యాచరణపై వున్న చిత్తశుద్దికి నిదర్శనం. నాడు పోలీసులు ఎంతో మంది నాయకులను ఎత్తి జీపుల్లో పడేసేవారు. జీపులపై నుంచి తోసేసేవారు. ఎంతో మంది మహిళా నాయకులనుకూడా అనేక రకాలుగా ఇబ్బందులకు గురిచేసేవారు. అయినా ఎక్కడా ఏ ఒక్క ఉద్యమ కారులు పోలీసులపై తిరగబడ్డ సన్నివేశం లేదు. సందర్భం అసలే లేదు. మరి షర్మిల ఏకంగా మహిళా పోలీసుపై చేయిచేసుకోవడం, ఎస్సైపై చేయి చేసుకోవడం, విధి నిర్వహణలో వున్న పోలీసులను గాడిదలు కాసుకోండ్రి అని మాట్లాడడం అహాంకారానికి నిదర్శనమే కాదు. 

నేరం కూడా…విధి నిర్వహనలో వున్న పోలీసులను అడ్డుకోడం తప్పని కూడా షర్మిలకు తెలియదా? పైగా వాహనం షర్మిల వెళ్తున్న సందర్భంలో పోలీసులు కారును అడ్డగిస్తే, తొక్కు, తొక్కు అంటూ డ్రైవర్‌ను బెదిరించడం, ఏకంగా గేర్‌ మార్చడం అహంబావానికి నిదర్శనం. ఒక రకంగా హింసను ప్రేరేపించే లక్షణం. అలాంటి ఆవేపరులకు రాజకీయాల్లో తావు లేదు. వాళ్లు ప్రజా సేవ చేస్తారంటే జనం కూడా నమ్మరు. ఇదిలా వుంటే షర్మిలను అరెస్టు చేశారని తెలిసి విజయమ్మ పోలీసు స్టేషన్‌కు వెళ్లే ప్రయత్నం చేశారు. అదే సమయంలో ఆమెను అడ్డుకున్న మహిళా పోలీసులపై విజయమ్మ కూడా చేయి చేసుకున్నారు. రాజకీయాల్లో వున్నవారికి ఎంత ఓర్పు, సహనం వుండాలి. గతంలో ఐదేళ్లు ఆమె భర్త రాజశేఖరరెడ్డి అధికారం చెలాయించాడు. ఇప్పుడు ఆమె కొడుకు జగన్మోషన్‌రెడ్డి ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రిగా వున్నారు. రాజకీయ నాయకులను అరెస్టు చేయడం పెద్ద విషయమేమీ కాదు. సర్వ సాదారణమే అన్న సంగతి తెలిసి కూడా కావాలని రాజకీయం చేయడం కాకపోతే మరేమిటి? హైప్‌ క్రియేట్‌ చేసుకుంటే మైలేజీ వస్తుందన్న దుర్బిద్ది రాజకీయం అంత సమ్మతం కాదు. అయినా తెలంగాణలో వుంటూ తెలంగాణ పోలీసులన దుర్భాషలాడడం, చేయి చేయిచేసుకోవడం తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమే? తెలంగాణ పోలీసులంతా తెలంగాణ ఉద్యమకారులే. తెలంగాణ వస్తేనే ఉద్యోగాలు వచ్చిన వారే..అలాంటి తెలంగాణ పోలీసుల పట్ల అనుచితంగా ప్రవర్తించిన షర్మిల ఖచ్చితంగా తెలంగాణ పోలీసులకు క్షమాపణ చెప్పాలిందే..అన్నది తెలంగాణ సమాజం నుంచి వస్తున్న డిమాండ్‌. 

    ఇక షర్మిలది, ఆమె తల్లి విజయమ్మది వింత రాజకీయం.

 ఆంధ్రప్రదేశ్‌లో జగన్మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చేదాకా ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయం చేశారు. అన్న కోసం చెల్లె, కొడుకు కోసం తల్లి ప్రచారం చేశారు. ఓట్లేశారు. గెలిపించుకున్నారు. తెలంగాణలో ఓటు హక్కు వారికి లేదన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. మరి అక్కడి ప్రజలకు ఇచ్చిన హమీల అమలుకు కృషి చేయాలిన బాధ్యతను గాలికి వదిలేసి, తెలంగాణ రాజకీయాల్లో ఏదో పొడిచేద్దామని వచ్చారు. రాజ్యాంగం కల్పించిన హక్కే…కాదని ఎవరూ అనడం లేదు. అన్ని రాష్ట్రాలు వేరు. తెలంగాణ వేరు. తెలంగాణ కొట్లాడి సాధించుకున్న రాష్ట్రం. ఒకప్పుడు మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోయినప్పుడు చెప్పుకున్న తెలుగువారి ఆత్మగౌరవం, తెలంగాణ విషయంలో కనిపించడం లేదా? తెలంగాణ కూడా ఆత్మగౌరవ నినాదంతో సాధించుకున్నదే అన్న సంగతి షర్మిలకు తెలియందా? అయినా తెలంగాణలో వైఎస్‌ కుటుంబానికి తావు లేదని ఉద్యమ కాలమే నిరూపించింది. మానుకోట జగన్మోహనరెడ్డిని రాళ్లతో తరిమింది. ఇంతకన్నా చరిత్ర సాక్ష్యం ఏముంటుంది? అవన్నీ షర్మిల మర్చిపోయి, స్వార్ధపూతిర రాజకీయ ముసుగేసుకొని వస్తే తెలంగాణ సమాజం నమ్ముతుందా? ఇప్పటికైనా షర్మిల చిల్లర రాజకీయాలు మానుకోవాలని తెలంగాణ వాదులంతా ముక్తకంఠంతో సూచిస్తున్నారు. తెలంగాణతో వున్న కొంత మంది శకునిపాత్ర పోషిస్తున్నవారు, శల్య సారధ్యం చేస్తూ, తెలంగాణ అభివృద్ధికి అడ్డుపడుతున్నారు. అందుకు కారణం వారికి పదవుల అందలేదనో , లేక గుర్తింపు రావడం లేదనో అసంతృప్తితో వున్న వాళ్లే..తప్ప నిజంగా వాళ్లు తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్లు కాదు. వాళ్లను నమ్ముకొని తెలంగాణలో రాజకీయం చేయడమంటే గుడ్దెద్దు చేలో పడ్డట్టే..అంటే అర్ధమైట్టే అనుకుంటున్నాం! ఎద్దుగుడ్డిది కదా? అని చేలు మేస్తుంటే ఏ రైతు ఊరుకోడు…అలాగే తెలంగాణలో వుంటూ తెలంగాణపై విషపూరితకుట్రలకు తెరతీస్తే తెలంగాణ వాదులు కూడా ఊరుకోకపోవచ్చు…ఓటు కోసం వచ్చినప్పుడు ప్రజలను కడుపులో పెట్టుకొమ్మని వేడుకోవాలే గాని, తెలంగాణ పోలీసులకు గాడిదలను కాయమంటే స్వాగతించరు. తాజాగా షర్మిలను పొలిమేర దాకా తరమాలని కూడా కొంత మంది తెలంగాణ వాదులు కూడా డిమాండ్లు చేస్తున్నారు..అది కూడా ఒకసారి తెలుసుకుంటే చాలా మంచిది.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version