మందమర్రి, నేటిధాత్రి:-
పట్టణంలోని ఎస్వీ టెంపుల్ ఏరియా ఓం శ్రీ వరసిద్ధి వినాయక మండలి ప్రాంగణంలో శనివారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అన్నదాతలు రాం ఆవదేశ్, రాం సింగ్, రాం మహేష్, రాం రమేష్ లు ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం సైతం వినాయక మండపం వద్ద అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండలి నిర్వహకులు, కాలనీవాసులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.