-సీఐ రమేష్, ఎస్సై ఉపేందర్
జైపూర్, నేటి ధాత్రి:
జైపూర్ మండలంలోని ప్రతి గ్రామము లో నిర్వహించే వినాయక నిమజ్జనం రోజున డీజే లు పెట్టడం వలన ప్రజలు ఇబ్బంది పడతారని ముందస్తు భాగంగా శ్రీరాంపూర్ సీఐ రమేష్, జైపూర్ ఎస్సై ఉపేందర్, జైపూర్ పోలీస్ స్టేషన్ కి మండలంలోని డిజే ఆపరేటర్లను పిలిపించి వినాయక నిమజ్జనం ఊరేగింపులో ఎవరు కూడా డీజే లు వాడొద్దని దీనిని ఎవరైనా అతిక్రమిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలియజేశారు.అనంతరం మండలంలోని డీజే ఆపరేటర్లను తహసిల్దార్ ఆఫీస్ ముందు బైండ్ ఓవర్ చేశారు. ఈ సందర్భంగా సిఐ రమేష్ మాట్లాడుతూ వినాయక నిమజ్జనం రోజున ప్రజలు జాగ్రత్త వహించాలని ముఖ్యంగా చిన్నపిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండాలని అన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా పూర్తిస్థాయిలో రక్షణ చర్యలు పాటించాలని గ్రామాలలో ఏర్పాటు చేసిన వినాయక మండపాల నిర్వహకులను ప్రజలను కోరారు.