మాలల హక్కుల సాధనకు ఐక్యంగాపోరాడాలి

గణపురం మండల అధ్యక్షులు పోతుల విజేందర్

గణపురం నేటి ధాత్రి
గణపురం మండలం గురువారం కోట గుళ్ళు ఆవరణలో జయశంకర్ జిల్లా మాజీ అధ్యక్షులు పసుల అశోక్, అధ్యక్షతన సమావేశం ఏర్పాటు ఏర్పాటు చేయనైనది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ జెల్ల ప్రభాకర్ హాజరై ప్రసంగించారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయ సాధన కోసం మనమందరం పనిచేయాలని మాలల హక్కుల కోసం పోరాటం చేయవలసిన అవసరం ఎంతైనా ఉన్నదని రానున్న రోజులలో రాజకీయంగా ఆర్థికంగా ఎదగాలంటే మాలలు కలిసికట్టుగా పనిచేయాలని ప్రభాకర్ కోరారుతెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కాంక్ష, తెలంగాణ మాలలు ఉనికి వెరసి 2006 అక్టోబర్ 27న కాలేశ్వరం ప్రకాష్ అన్న గారి ఆధ్వర్యంలో అద్దంకి దయాకర్ అన్న నేతృత్వంలో ఉమ్మడి వరంగల్ జిల్లా ఎటునాగారం కేంద్రంగా పురుడు పోసుకున్న తెలంగాణ మాల మానాడు అంచలంచలుగా నేడు జాతీయ మాల మానాడు గా విస్తరించి అనేక పోరాటాలకు చిరునామాగా నిలిచింది కావున జయశంకర్ జిల్లా వ్యాప్తంగా మాల సోదరులు అక్టోబర్ 27న 18వ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ జెల్ల ప్రభాకర్ పిలుపునిచ్చారుఅనంతరం తెలంగాణ మాల మహానాడు గణపురం మండలం కమిటీ ఎన్నుకోవడం జరిగిందిగౌరవ అధ్యక్షులుగా చెన్నూరి మధుకర్
గణపురం మండల అధ్యక్షులుగా ధర్మ రావు పేట గ్రామానికి చెందిన పోతుల విజేందర్ ను ఎన్నుకోవడం జరిగింది
ఉపాధ్యక్షులుగా బుద్ధారం గ్రామానికి చెందిన ఊరడి మురళి.
ప్రధాన కార్యదర్శిగా అప్పయ్య పల్లి గ్రామానికి చెందిన నోముల రంజిత్.
సహాయ కార్యదర్శిగా గణపురం గ్రామానికి చెందిన అంతుకూరి నరసయ్య
కోశాధికారి గాంధీ నగర్ గ్రామానికి చెందిన బత్తుల కృష్ణ
గణపురం మండల వర్కింగ్ ప్రెసిడెంట్ గా చెన్నూరి మోహన్ బాబు. చేల్పూర్ గ్రామం.
కార్యవర్గ సభ్యులుగా యనమల ప్రశాంత్, నోముల హరీష్, నోముల రాకేష్ లను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది
ఇట్టి కార్యక్రమంలో రేగొండ మండల అధ్యక్షులు మండల తిరుపతి, గోరుకొత్తపల్లి మండల అధ్యక్షులు పసుల రాకేష్. గుండు నారాయణ. ముప్పిడి శంకర్. ముక్తేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version