పల్లె ప్రగతితో గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి…

నియోజకవర్గం అభివృద్ధిని పట్టించుకోని ఈటెల…

పల్లె ప్రగతి 5వ విడత కార్యక్రమం ప్రారంభంలో కౌశిక్ రెడ్డీ…

నేటిధాత్రి కమలాపూర్(హన్మకొండ)తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన పల్లె ప్రగతి కార్యక్రమము ద్వారా రాష్ట్ర

వ్యాప్తంగా అన్ని గ్రామీణ ప్రాంతాలు అభివృద్ది దిశగా ముందుకు సాగుతున్నాయని ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డీ అన్నారు. ఐదవ విడత పల్లెప్రగతి కార్యక్రమములో భాగంగా సోమవారం హుజూరాబాద్ శాసనసభ నియోజకవర్గం పరిధిలోని కమలాపూర్ మండల కేంద్రం తో పాటు ఉప్పల్,మర్రిపల్లీ గూడెం తదితర గ్రామాల్లో జరిగిన పల్లెప్రగతి కార్యక్రమాల్లో హన్మకొండ జిల్లా పరిషత్ చైర్మన్ సుదీర్ కుమార్ తో పాటు పాల్గొని ప్రసంగించారు.ఆయా గ్రామాల్లో క్రీడా మైదానాలు ప్రారంభించి,మొక్కలు నాటారు. సమావేశంలో భారీగా హాజరైన ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి కెసిఆర్ సారథ్యంలో గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి ధ్యేయంగా అనేక పథకాలు ప్రవేశ పెట్టింది అని, అందులో ముఖ్యమైనది పల్లె ప్రగతి కార్యక్రమం అని కొనియాడారు. ఈ కార్యక్రమములో భాగంగా కోట్లాది రూపాయల నిధులు కేటాయిస్తూ గ్రామాల్లో ప్రకృతి వనాలు,స్మశాన వాటిక లు,మురుగు కాలువలు నిర్మాణం,పారిశుద్ధ్యం నిర్వహణకు గాను గ్రామ పంచాయతీ లకు ట్రాక్టర్లు, అటో లాంటి వాహనాలు సమకూర్చు తుందని అన్నారు.తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలంగాణ ప్రజల సంపూర్ణ అభివృద్ది లక్ష్యంగా కెసిఆర్ నాయకత్వములో తెరాస ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తూ అన్ని వర్గాల ప్రజల అభివృద్ది ధ్యేయంగా ఎక్కడ లేని విధంగా మహిళలు,యువకులు,రైతులకు అందరి అభివృద్ది ధ్యేయంగా కళ్యాణ లక్ష్మి, షాధి ముబారక్,రైతు బంద్,రైతు బీమా,పెన్షన్లు,లాంటి పథకాలు అమలు చేస్తున్న రాష్ట్రం తెలంగాణ మాత్రమే అన్నారు.స్వాతంత్య్రం వచ్చిన నుండి తెలంగాణ ఏర్పాటు కాక ముందు వరకు అప్పటి ప్రభుత్వాలు తెలంగాణ ప్రాంతాన్ని ఎడారిగా మార్చి,సమస్యల సుడగుండంలో పడే సారని,రాష్ట్రం ఏర్పాటు జరిగినంక కేంద్రం లోని బీజేపీ ప్రభుత్వం సహకరించక పోయిన కెసిఆర్ సాహసోపేత నిర్ణయాలు తీసుకుంటూ రాష్ట్రాన్ని అన్ని రాష్ట్రాలలో ఆదర్శ రాష్ట్రంగా నిలిపా డని ఇదంత కెసిఆర్ కు మాత్రమే సాధ్యం అన్నారు. ఈ సందర్బంగా కౌశిక్ రెడ్డీ హుజూరాబాద్ శాసనసభ్యుడు ఈటెల రాజేందర్ ను ఘాటుగా విమర్శించారు.ఎనిమిది సంవత్సారాలు మంత్రిగా పనిచేసి కమలాపూర్ అభివృద్ది మరిచి,తన స్వార్థం కోసం పనిచేశాడు అని మాయ మాటలతో ప్రజలను నమ్మించి మళ్ళీ శాసనసభ్యుడు గా ఎన్నికై ఎనిమిది నెలలు గడుస్తున్నా నియోజక వర్గ ప్రజల సమస్యలు పట్టించుకోకుండా తిరుగుతున్నాడని దుయ్యబట్టారు.గ్రామాల్లో జరుగుతున్న పల్లె ప్రగతి లాంటి ప్రభుత్వ కార్యక్రమాల్లో కూడా పాల్గొనకుండా తిరుగుతున్నాడని విమర్శించారు.తన నియోజకవర్గం అభివృద్ది చేయని వాడు రాష్ట్రాన్ని ఉద్దరిస్తాను అంటూ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తానని అనడం సిగ్గు చేటని మరో సారి ఈటెల పై నిప్పులు చేరిగాడు.మండలములో ను వివిధ గ్రామాల్లో గల సమస్యలు పరిష్కారానికి గాను ముఖ్యమంత్రి తనను పంపించారని,ప్రజలు సహకరించి అన్ని సమస్యల పరిష్కారం కోసం ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్బంగా ఉప్పల్ గ్రామ మహిళా గ్రూప్ సభ్యులకు రూ.ఐదు లక్షల చెక్కు అందించారు.కార్యక్రమ ప్రారంభం ముందుగా పార్టీ కార్యకర్తలు,నాయకులు,అభిమానులు బైక్ లు కార్లతో బారి ర్యాలీ తీశారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version