పని, ప్రశస్తి వదిలేసి, కుల ప్రస్తావనెక్కడిది!

`సామాన్యులకు సేవ చేయమంటే కులమెందుకు ముందుకొస్తుంది?

`ప్రమోషన్లలో అన్యాయం జరిగితే కొట్లాడండి?

`పై అధికారులు చులకన చేస్తే అప్పుడు చెప్పండి!

`పని చేయమని ప్రజలు తిరుగుంటే పట్టించుకోవద్దని ఏ కులం చెప్పింది!

` అదే సామాజిక వర్గ బాధితులు కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు?

`మరి వారి గోడు ఎందుకు పట్డడం లేదు?

`మీరే వాళ్లకు పనిలో నిర్లక్ష్యం చేస్తే వాళ్లెవరికి చెప్పుకోవాలి?

`పని చేసి మంచి పేరు తెచ్చుకొమ్మని చెప్పడం నేటిధాత్రి తప్పా?

`మంచి అధికారిగా గుర్తింపు పొందమని చెప్పే సూచన నచ్చలేదా?

`పేదలకు సేవ చేస్తే చేతులెత్తి దండం పెడతారు?

`ఎన్ని సార్లు తిరిగినా పని చేయకపోతే తిట్టిపోస్తారు? 

`అదే కదా నేటిధాత్రి చెబుతోంది!

`నేను పని చేయను, అని మీడియా మీద ఓ రాయేస్తే సరిపోతుందా?

`పని చేయకపోయినా ఫరవాలేదా?

హైదరాబాద్‌,నేటిధాత్రి:

 నేటిధాత్రి సామాన్య ప్రజల గొంతుక. సమస్య ఎక్కడుంటే నేటిధాత్రి అక్కడ వుంటుంది. బాధితులకు అండగా వుంటుంది. నేటిధాత్రి రాసే అక్షరాలు ప్రజల సమస్యలు. అంతే తప్ప అక్కడ వ్యక్తి గత ప్రస్తావనలకు తావు లేదు. ప్రతి వారికి వ్యక్తి గత జీవితాలు వుంటాయి. వాటిని నేటిధాత్రి ఎప్పుడూ ప్రస్తావించే ప్రయత్నం చేయదు. మండలంలోని అనేక మంది ప్రజలు నిత్యం కొన్ని సంవత్సరాలుగా తహసీల్దారు కార్యాలయం చుట్టూ అలుపెరగ తిరుగుతున్నామని తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆందోళన చెందుతున్నారు. దుఖం ఆపుకోలేక నేటిధాత్రి ముందు గోడు వెల్లబోసుకుంటున్నారు. తహసీల్దారు తమను చూస్తే పురుగుల్లా చూస్తున్నారు. కనీసం తమ సమస్య చెప్పుకోవడానికి సమయం ఇవ్వడం లేదు అని విలపిస్తున్నారు. కనీసం వాళ్ల సమస్య తెలుసుకునే ప్రయత్నం తహసీల్దారు చేయనప్పుడు ప్రజల ఆవేదనకు అక్షరాల రూపం ఇవ్వడం నేటిధాత్రి కర్తవ్యం. మా బాధ్యత మేం నిర్వర్తించాం…తహసీల్దారు చేయాల్సిన పని గుర్తు చేస్తున్నాం…ప్రభుత్వ అధికారితో పని చేయించుకోవడం ప్రజల హక్కు. ప్రజలు చెల్లించే పన్నుల నుంచే అధికారులకు జీతాలు ఇస్తారు. అలాంటి ప్రజలకు పనులు చేయకపోవడం తప్పు. వృత్తికి న్యాయం చేయాలన్న ఆలోచనతో ఉద్యోగి పని చేయాలి. చట్టం ఇదే చెబుతోంది. పని చేయను…చేయమని అడిగిన వారిని నిందిస్తాను…బెదిరిస్తాను…కులం సాకుగా చూపి అపవాదులేస్తాను అనడం, బాధ్యతల మీద శ్రద్ధ వున్నవారు మాట్లాడాల్సిన మాటలు కాదు. తహసీల్దారు కుర్చీ అనేది బాధ్యత. అధికారం…హోదా మాత్రమే అనుకుంటే ప్రజలకు సేవ చేయలేరు. నిజంగా తహసీల్దారు కార్యాలయం చుట్టూ ప్రజలు తిరగాల్సిన పని లేకుండా, సకాలంలో పని పూర్తయితే సమస్యే వుండదు. చేయాల్సిన పని వదిలేసి, సామాన్యులను ఇబ్బందులు పెడితే మీడియా చూస్తూ ఊరుకుంటుందా? 

ఉద్యోగులకు ప్రమోషన్లలో అన్యాయం జరిగితే రాసేది మీడియానే?

 అందులోనూ రిక్రూట్‌ మెంట్‌ లలో ఏ మాత్రం అన్యాయం జరిగినా బాధితులు ఆశ్రయించేది మీడియానే…ఎంత పెద్ద ఉద్యోగ వ్యవస్థ అయినా తమ డిమాండ్ల పరిష్కారం కోసం తొక్కేది మీడియా గడపనే…రాజకీయ నాయకులైనా, ప్రభుత్వాలైనా, ప్రజా సంఘాలైనా మీడియా కు వాళ్ల సమస్య చెప్పాల్సిందే…! పై అధికారులు చులకన చేస్తే అప్పుడు చెప్పండి! ఉద్యోగ వ్యవస్థలో మహిళలని చూడకుండా, పై అధికారులు కులం పేరుతో దూషించినా చెప్పేది మీడియాకే…!పని చేయమని ప్రజలు తిరుగుతుంటే పట్టించుకోవద్దని ఏ కులం చెప్పింది! అదే సామాజిక వర్గ బాధితులు అనేక మంది తహసీల్దారు కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు? ఉద్యోగంలో విధి నిర్వహణ గుర్తు చేస్తే కులం ఎందుకు మధ్యలోకి వస్తుంది. తహసీల్దారు కార్యాలయం చుట్టూ నిత్యం తిరుగే వారిలో బడుగు బలహీన వర్గాల ప్రజలే ఎక్కువ వుంటారు. మరి వారి గోడు ఎందుకు పట్డడం లేదు? తహసీల్దారు సామాన్య ప్రజల పనిలో నిర్లక్ష్యం చేస్తే వాళ్లెవరికి చెప్పుకోవాలి? పని చేసి మంచి పేరు తెచ్చుకొమ్మని చెప్పడం నేటిధాత్రి తప్పా? మంచి అధికారిగా గుర్తింపు పొందమని చెప్పే సూచన నచ్చలేదా? పేదలకు సేవ చేస్తే చేతులెత్తి దండం పెడతారు? ఎన్ని సార్లు తిరిగినా పని చేయకపోతే తిట్టిపోస్తారు? అదే కదా నేటిధాత్రి చెబుతోంది! నేను పని చేయను అనుకునే అధికారులే మీడియా మీద ఓ రాయేస్తే సరిపోతుందని? ఆలోచిస్తుంటారు. పని చేయకపోయినా ఫరవాలేదా? వృత్తి ధర్మం వదిలేసి, మీడియా మీద నిందలేసి తప్పించుకుంటా? అనుకుంటే వ్యవస్థ ఊరుకుంటుందా? ప్రశ్నించకుండా వుంటుందా? ప్రజా సంఘాలు నిలదీయవా? 

తహసీల్దారు జ్యోతి ఒక వ్యక్తి తనకు న్యయం చేయమని వేడుకున్నా కనికరించలేదు. 

కోర్టు ఆదేశాలు పాటించమని అడిగితే పట్టించుకోలేదు. ఆఖరుకు కలెక్టర్‌ ప్రస్తావన తీసుకొస్తే తహసీల్దారు చెప్పాల్సిన సమాధానం అదేనా? పై అధికారుల ఆదేశాలు పాటించక, సామాన్య ప్రజల సమస్యలు పరిష్కరించక, ఖాళీగా కూర్చోవడానికా ఉద్యోగం. పేదల సమస్యలు తీర్చని అధికారులకు కర్తవ్యం ఎలా గుర్తు చేస్తామో! ప్రజలకు మంచి సేవలందించే అధికారుల గొప్పదనం కూడా పాఠకుల ముందుకు తెస్తుంటాం. అధికారులు ఆదర్శంగా వుండాలి. సామాన్య ప్రజల పక్షాన వుండాలి. ఉద్యోగం సంపాదించుకునే ముందు అందరూ పేదలకు సేవ చేయాలని వుందంటారు. అదేంటొ కొందరు కొద్ది రోజుల్లోనే ఆ విషయం మర్చిపోయి వివాదాలకు కేరాఫ్‌ అవుతారు. ఏది ఏమైనప్పటికీ పద్దెనిమిది సంవత్సరాలుగా నేటిధాత్రి అలుపెరగని అక్షర ప్రయాణంలో ప్రజా గొంతకై అక్షర సమరనాధాల తాండవం సాగిస్తూనే వుంది.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version