# మోకుదెబ్బ రాష్ట్ర కార్యదర్శి రమేష్ గౌడ్
నర్సంపేట,నేటిధాత్రి :
బిసి రిజర్వేషన్ గల
నర్సంపేట మార్కెట్ కమిటీ చైర్మన్ పదవిని గౌడ కులస్థునికి నియమించాలని గౌడ జన హక్కుల పోరాట సమితి మోకుదెబ్బ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనంతుల రమేష్ గౌడ్ తెలిపారు.నర్సంపేట పట్టణంలో మోకుదెబ్బ డివిజన్ కమిటీ సమావేశం డివిజన్ అధ్యక్షులు కందుల శ్రీనివాస్ గౌడ్ అధ్యక్షతన శనివారం జరిగింది. ఈసందర్బంగా ముఖ్య అతిధిగా విచ్చేసిన రమేష్ గౌడ్ మాట్లాడుతూ నియోజకవర్గంలో తెలంగాణా ఉద్యమంలో గౌడ కులస్థులు అగ్ర బాగాన నిలిచారన్నారు.తెలంగాణా రాష్ట్రం కోసం గౌడ ఉద్యమకారులు నియోజకవర్గంలో ఆర్థికంగా, రాజకీయంగా ఎంతో నష్ట పోయారని ఆయన అవేదన వ్యక్తంచేశారు. ఎదో ఒక రోజు రాష్ట్రo సిద్దించ్చాక మంచి రోజు వస్తుందన్న ఆశతో ఎదురు చూస్తున్నారన్నారు.నియోజకవర్గంలో 30 వేల పైచిలుకు ఓట్లు గల గౌడ ఉద్యమకారులకు ఎలాంటి న్యాయం జరుగలేదన్నారు.ఉద్యమం సమయంలో కేసులు, జైలు శిక్షలు అనుభవించిన,బిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుంచి ఒకే పార్టీలో ఉన్న గౌడ్ లకు నామినేటెడ్ పదవిచ్చి ఆర్థికంగా ఆదుకోవాలని రమేష్ గౌడ్ తెలిపారు.
# మోకుదెబ్బ కమిటీలో చేరిన పలువురు నాయకులు..
నర్సంపేట మండలం నాగుర్లపల్లికి చెందిన తెలంగాణా ఉద్యమకారుడు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు మచ్చిక నర్సయ్యగౌడ్ ను రాష్ట్ర కమిటీ సభ్యుడుగా, నర్సంపేట పట్టణానికి చెందిన కొయ్యేడి సనత్ గౌడ్ ను డివిజన్ ప్రచార కార్యదర్శిగా నియమించినట్లు రమేష్ గౌడ్ తెలిపారు.ముందుగా వారికి మోకుదెబ్బ కండువాను కప్పి స్వాగతించారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షులు గోపగాని వెంకన్న గౌడ్, ముంజాల రాజేందర్ గౌడ్, మచ్చిక రాజు గౌడ్,గంప రాజేశ్వర్ గౌడ్, రామగోని సుధాకర్ గౌడ్, మద్దెల సాంబయ్య గౌడ్, శీలం వీరన్న గౌడ్, దొంతి సంతోష్ గౌడ్, బోడిగే మల్లేశం గౌడ్, జూలూరి హరిప్రసాద్ గౌడ్, గండి యాదగిరి గౌడ్, పెరుమాండ్ల రాజ్ కుమార్ గౌడ్, ఏరుకొండ సదానందం గౌడ్, గోపగాని శోభన్ గౌడ్,కల్లెపు వెంకట్ నారాయణ గౌడ్, జునూరి నరేష్ గౌడ్, సట్ల సురేష్ గౌడ్, మేరుగు రమేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.