*వారి జ్ఞాపకార్ధం అనాధ ఆశ్రమంలో దుప్పట్లు పంపిణీ రవీందర్ యాదవ్
శేరిలింగంపల్లి,నేటి ధాత్రి:-
శేరిలింగంపల్లి నియోజకవర్గం మాజి టిఆర్ఎస్ ఇంచార్జి దివంగత కొండకల్ శంకర్ గౌడ్ వర్ధంతి సందర్బంగా జ్ఞాపకార్థం కోసం మియాపూర్ లోని వివేకానంద సేవాసమితి అనాధ ఆశ్రమంలో దుప్పట్లను పంపిణి చేసిన … బి ఆర్ ఎస్ రాష్ట్ర నాయకులు రవీందర్ యాదవ్ ఆధ్వర్యంలో అనాధ ఆశ్రమం లో అందజేయడం జరిగింది. ఈ నేపథ్యంలో రవీందర్ యాదవ్ మాట్లాడుతూ తెలంగాణ కోసం అహర్నిశలు కృషి చేసి , అలసట లేకుండా పోరాటం చేసిన నాయకుడు దివంగత కొండకల్ శంకర్ గౌడ్, ఆనాటి తెలంగాణ ఉద్యమంలో భాగంగా చందానగర్ లో దదాదాపు 400 రోజులు పైగా రిలే నిరాహార దీక్షలు చేపట్టారు , అదేవిధంగా వంటావార్పు , మానవహారం లాంటి కార్యక్రమాలు చేసి శేరిలింగంపల్లి ప్రజల మనసుల్లో ఒక దేవుడిలా నిలిచిపోయాడు , అలాంటి వ్యక్తి మన మధ్యలో లేనందుకు తెలంగాణ రాష్ట్రం చింతించాల్సిన అవసరం ఎంతైనా ఉందని రవీందర్ యాదవ్ పేర్కొన్నారు.దుప్పట్ల ను అందజేసిన నేపథ్యంలో ఆశ్రమం నిర్వాహకులు రవీందర్ యాదవ్ కు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో రవిందర్ యాదవ్ తో పాటు తెరాస యువ నాయకులు గణేష్ రెడ్డి పాల్గొన్నారు