జైపూర్ మండలంలో రోజురోజుకీ పెరుగుతున్న కాంగ్రెస్ పార్టీ కండువాలు

జైపూర్,నేటి ధాత్రి:

మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలో రోజురోజుకీ బిఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి వలసలు పెరుగుతూనే వస్తున్నాయి. తాజాగా గురువారం రోజున జైపూర్ మండలంలోని రామారావు పేట గ్రామం నుండి బీఆర్ఎస్ పార్టీని వీడి మాజీ ఉపసర్పంచ్ తంగళ్ళపల్లి వెంకటేశం, వార్డు మెంబర్ గోలి వెంకటేష్, లోడింగ్ అండ్ అన్ లోడింగ్ వర్కర్స్ యూనియన్ నాయకుడు బొద్దున రాజేశం, పద్మశాలి సంఘం నాయకుడు మెరుగు సమ్మయ్య మరియు ఇంకొంతమంది నాయకులు, కార్యకర్తలు చెన్నూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి నివాసంలో కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. అందరికీ కండువాలు కప్పి ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి సాధారంగా కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. ఎమ్మెల్యే వివేక్ వెంకట్ స్వామి మాట్లాడుతూ తల్లి లాంటి కాంగ్రెస్ పార్టీలోకి చేరిన అన్నదమ్ములు ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేస్తూ చెన్నూర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లడానికి అన్నివేళల ముందు ఉంటానని, నాయకుల, కార్యకర్తల అండదండలు, ప్రజల ఆశీస్సులు ఎప్పుడు తోడుండాలని, అందరం కలిసికట్టుగా కృషిచేసి పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకీ ఘన విజయాన్ని అందించాలని తెలియజేశారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీలోకి చేరిన నాయకులు మాట్లాడుతూ రాబోవు పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను అత్యధిక మేజారిటీతో గెలిపించేందుకు తమ సాయశక్తుల కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ నామాల సత్యవతి తిరుపతి, మాజీ ఎంపీటీసీ ముదం రమేష్,మాజీ ఉప సర్పంచ్ గుండా శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మహమ్మద్ ఫయాజ్జుద్దీన్, కాంగ్రెస్ నాయకుడు నామాల నాగరాజు,కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *