జమ్మికుంట (కరీంనగర్ జిల్లా ), నేటిధాత్రి :
జమ్మికుంట పట్టణంలో శనివారం ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. స్థానిక బొమ్మల గుడి (శివాలయం)లో అన్నదాన కార్యక్రమం, ఫోటోగ్రఫీ మిత్రుల సమక్షంలో కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు బి.కే వెంకన్న, రచ్చ గణేష్, ముఖ్య సలహాదారులు శివన్న, మయూరి శ్రీధర్, అధ్యక్షులు చిన్నింటి నాగేందర్, ఉపాధ్యక్షులు మెగా అజర్, ప్రధాన కార్యదర్శి బిట్ల తిరుపతి, కార్యదర్శి మోరే జాన్, సభ్యులు శ్రీరాములు, విగ్నేష్, రాజేందర్, నిఖిల్, కుమార్, రజనీకాంత్, ఉపేందర్, విజయ్ తదితరులు పాల్గొన్నారు.