వ్యవసాయ మార్కెట్లో షాపింగ్ కాంప్లెక్స్ ప్రారంభించిన ఎమ్మేల్యే చల్లా

వర్షంలోనే కొనసాగిన ఎమ్మెల్యే పర్యటన

రూ.1 కోటి 98లక్షలతో పూర్తయిన పలు అభివృద్ది పనుల ప్రారంభం

పరకాల నేటిధాత్రి(టౌన్)
పరకాల పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో శనివారం స్థానిక ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పర్యటించారు.ఈ సందర్భంగా మార్కెట్ ఆవరణలో నూతనంగా నిర్మించిన రూ.84 లక్షలతో షాపింగ్ కాంప్లెక్స్,రూ.15 లక్షలతో టాయిలెట్స్ బ్లాక్స్, రూ.26 లక్షలతో 40వేల లీటర్ల సామర్థ్యం గల ఓ.హెచ్.ఎస్.ఆర్ వాటర్ ట్యాంక్ , రూ.73 లక్షలతో మార్కెట్ యార్డ్ చుట్టూ నిర్మించిన ప్రహరీగోడను ప్రారంభించారు.ఈ సందర్బంగా ఎమ్మేల్యే మాట్లాడుతూ రైతులకు ఏ ఇబ్బంది కాకుండా మార్కెట్ యార్డ్ లో అన్ని సౌకర్యాలు ఏర్పాటు కల్పించామన్నారు.పరకాల మార్కెట్ యార్డ్ ను అధునికరణగా తీర్చిదిద్దెందుకు కృషి చేస్తున్న చైర్మెన్, కమిటీ సభ్యులను ఎమ్మేల్యే అభినందించారు.స్థానిక ప్రజలు మార్కెట్ యార్డ్ షాపింగ్ కాంప్లెక్స్ ను ఉపయోగించుకోవచ్చని అన్నారు.గత ప్రభుత్వాల్లో మార్కెట్ యార్డ్ ఈ విధంగా ఎందో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత మార్కెట్లు యార్డ్ లు ఏ విధంగా రూపురేఖలు మరాయో చూడాలన్నారు.తెలంగాణ రాష్ట్రంలో రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందన్నారు.దేశంలోని రాష్ట్రాలన్ని తెలంగాణ వైపు చూసేల చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ దని అన్నారు.ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు,నాయకులు, కార్యకర్తలు,రైతులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *