కూసుకుంట్లకిస్తే ఒప్పుకోం?

`ఈసారి మాత్రం అసలే సహకరించం?

`మాకు విలువివ్వని కూసుకుంట్ల కోసం పని చేయం.

`కేవలం పార్టీ ఆదేశాలకు బద్దులై కూసుకుంట్లను గెలిపించాం.

`కార్యకర్తలను పట్టించుకున్నది లేదు.

`నాయకులకు అండగా నిలిచింది లేదు.

`ఎన్నికల సమయంలో నాయకులు చేసిన పనులకు బిల్లులు ఇచ్చింది లేదు.

`పార్టీ కోసం ఎంత కష్టమైనా పడతాం.

`కూసుకుంట్లకు ఇస్తే మాత్రం సహకరించం.

`మునుగోడులో బిఆర్‌ఎస్‌ బలంగా వుంది.

`కూసుకుంట్లకిస్తే మొదటికే మోసానికొస్తుంది.

`ఈసారి బిసిలకిస్తేనే బెస్ట్‌!

`గత ఉప ఎన్నికలలో కూడా పార్టీ శ్రేణులు కోరిందిదే!

`సార్వత్రిక ఎన్నికలలో బిసికి టికెట్‌ ఇస్తే బిఆర్‌ఎస్‌ గెలుపు గ్యారెంటీ!

`కూసుకుంట్ల కోసం రెండు నెలలు సహకరించింది నేటిధాత్రి.

కూసుకుంట్ల పనితీరును ప్రశ్నించే హక్కు నేటిధాత్రి కె ఉంది

`పని చేయకుంటే నిలదీస్తామని ముందే చెప్పింది నేటిధాత్రి.

`అందుకే నేటిధాత్రి కి పిర్యాధులందుతున్నాయి.

`మునుగోడు గ్రౌండ్‌ రిపోర్ట్‌ నేటిధాత్రి చేతిలో…

`నేటిధాత్రి కథనంపై కూసుకుంట్ల అక్కసు.

`గెలిపించిన వాళ్లకు ప్రశ్నించే హక్కుంటుందని మర్చిపోయిన కూసుకుంట్ల.

`ఈసారైనా ప్రజల మనసు చూరగొనేలా వ్యవహరించమని చెప్పాం.

`అయినా కూసుకుంట్లలో మార్పులేదంటున్న జనం.                                     

హైదరబాద్‌,నేటిధాత్రి: 

నమ్మి నానపోస్తే పుచ్చి బుర్రలైనట్లు…ప్రజలు నాయకుడిగా ఎన్నుకున్నాక కూడా తీరు మారకుంటే ఇంతకంటే ఏ మంటారు? రాజకీయాలు కావాలి. పదువులు కావాలి. పెత్తనం నడదవాలి. కాని ప్రజల్లో వుండను. ప్రజల సమస్యలు పట్టించుకోను. ప్రజలను దరి చేరనీయను. పార్టీకి అండగా నిలవను. పార్టీ నాయకులను కలవను. వారిని ప్రోత్సహించను. వారికి ఎలాంటి దారి చూపను. రాజకీయంగా వారి ఉన్నతిని కోరుకోను? వారెవరికీ అందుబాటులో వుండను. కాని ఎన్నికలప్పుడు మాత్రం వారు పనిచేయాలి. తన గెలుపుకోసం కష్టపలి. తనను గెలిపించాలి. ప్రతిసారి నేనే నిలబడాలి. మీరంతా నా గెలుపుకోసం కృషి చేయాలి. గెలిపించి మళ్లీ ఎన్నికల దాకా నన్ను మర్చిపోవాలి. ఇదీ మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి తీరని అటు జనం, ఇటు పార్టీ నాయక గణం చెప్పుకుంటున్న మాట. పార్టీ పేరు చెప్పుకొని రాజకీయాలు చేయాలి. ఉద్యమ కారుడిగా పదవులు కావాలి. కాని ప్రగతిని కాంక్షించలేని, అభివృద్ధి గురించి తాపత్రయపడని నాయకుడు ఎవరైనా వున్నారంటే అది మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్లనే అని జనం చెబుతున్నారు. అదేంటో జనంలో లేకపోయినా, జనం వద్దనుకున్నా, కొన్ని సార్లు అదృష్టం కలిసొచ్చి పదవులు వరిస్తుంటాయి. అయినా వాళ్లు ప్రజల కోసం ఆలోచించరు. 2014 ఎన్నికల్లో మునుగోడు ఎన్నికల్లో కూసుకుంట్ల ప్రభాకర్‌ రెడ్డి గెలిచారు. 2018 ముందస్తు ఎన్నికల్లో ఓడిపోయారు. తెలంగాణ మొత్తం బిఆర్‌ఎస్‌ ప్రభంజనం కనిపించింది. ఎవరూ ఊహించని విధంగా బిఆర్‌ఎస్‌ 88 సీట్లు గెల్చుకున్నది. కాని మునుగోడు కాంగ్రెస్‌ కైవసం చేసుకున్నది. మునుగోడు అభివృద్ధి జరగలేదా? అంటే తెలంగాణలోని అన్ని నియోకవర్గాల కంటే ఒకింత ఎక్కువే జరిగింది. అప్పటి వరకు మునుగోడులో వున్న సమస్యలన్నీ దాదాపు తీరాయి. అయినా మునుగోడులో కూసుకుంట్ల ఎందుకు ఓడిపోయాడు? అంటే మునుగోడు అభివృద్ధి జరిగింది వాస్తవం. కాని ఆ ముగుగోడు అభివృద్ధిలో కూసుకంట్ల పాత్ర లేదనేది కూడా మరింత వాస్తవం. మునుగోడు అభివృద్దిపై ముఖ్యమంత్రి కేసిఆర్‌ ప్రత్యేక దృష్టిపెట్టి, ప్రగతిపై ప్రత్యేక శ్రద్దపెట్టి అతి తక్కువ కాలంలో మునుగోడు రూపు రేఖలు మార్చాడు. పైలెట్‌ ప్రాజెక్టుల కింద మునుగోడును ముందంజలో నిలిపారు. మునుగోడును అన్ని రంగాలలో అభివృద్ధి చేశారు. కాని ఆ అభివృద్ధిలో కూసుకుంట్ల పాత్ర ఎంత? అంటే ఆయనే చెప్పలేనంత? ఎందుకంటే జరిగిన అబివృద్ది కళ్ల ముందు కనిపిస్తున్నది. కాని 2018 ఎన్నికల్లో కూసుకుంట్ల ఓడిపోయాడు. అంటే అక్కడ పార్టీ ఓడిపోలేదు. ఎమ్మెల్యే వ్యవహార శైలి మాత్రమే ఓటమిపాలయ్యింది. అంతగా మునుగోడు అభివృద్ధి జరిగినా ఆయన ఖాతాలో పడలేదంటే ఆయన నిర్లక్ష్యం ఎంతో చెప్పకనే చెప్పొచ్చు. 2018 ఎన్నికల్లో ఎమ్మెల్యేలంతా బంబపర్‌ మెజార్టీతో గెలిచారు. దాదాపు సగం మంది బిఆర్‌ఎస్‌ ఎమ్యెల్యేలు 50 వేలు, 60వేల మెజార్టీపైనే గొప్ప విజయాలు సొంతం చేసుకున్నారు. కాని మునుగోడులో కూసుకుంట్లను ప్రజలు ఆదరించలేదు. కేవలం ఉద్యమ కారుడన్న ఒకే ఒక్క కారణంతో మునుగోడు ఉప ఎన్నికల్లో ఎంత మంది టికెట్‌ కోసం ఆశించినా అందిరినీ కాదని మళ్లీ కూసుకుంట్లకే ముఖ్యమంత్రి కేసిఆర్‌ అవకాశం కల్పించారు. ఒక్క కూసుకుంట్ల కోసం బిఆర్‌ఎస్‌ యంత్రాంగమంతా దిగి ప్రచారం సాగించింది. మరి అదంతా కూసుకుంట్లకు గుర్తుందా? అన్న ప్రశ్న తలెత్తుతోంది. గతంలో ఎలా వున్నాడో? ఇప్పుడూ అలాగే వున్నాడు. ఎక్కడా ఆయన వ్యవహార శైలిలో మార్పు రాలేదు. ప్రజలను పట్టించుకునేంత తీరిక లేదు. ఎండల్లో బైటకు రాలేదు. ప్రజల సమస్యలు తెలుసుకోవాలన్న ఆలోచన లేదు. పార్టీ కార్యకర్తల సమావేశాలు పెద్దగా ఏర్పాటు చేసింది లేదు. సమన్వయం అన్నది అసలే లేదు. ఇది బిఆర్‌ఎస్‌ పార్టీ శ్రేణులు భహిరంగంగానే చెబుతున్న మాట. విమర్శిస్తున్న మాట. ఎన్నికల ముందు పార్టీకి చెందిన నేతలంతా అసమ్మతి రాగమే ఆలపించారు. ఆయనకు మద్దతుగా నిలబడిన వారు ఎవరూ లేరు. అయినా పార్టీ ఆదేశాలు క్రమశిక్షణ కలిగిన పార్టీ యంత్రాంగం శిరసావహించింది కూసుకుంట్లను గెలిపించింది. మరి కూసుకుంట్ల ఏం చేశాడన్నదే ఇక్కడ ప్రశ్నగా మారింది. 

ఉప ఎన్నికల్లో రెండు నెలల పాటు కూసుకుంట్లకు మద్దతుగా, తెలంగాణ ఉద్యమంలో భాగాస్వామ్య పత్రికగా ఇప్పటికీ తెలంగాణ పునర్నిర్మాణం, బంగారు తెలంగాణ నిర్మాణంలో లో పాలు పంచుకుంటున్న తెలంగాణ పత్రిక నేటిధాత్రి.

 మునుగోడు ఉప ఎన్నికల సమయంలో మునుగోడు ప్రగతిపై ఏ పత్రిక రాయనటు వంటి వార్తలు రాసింది ఒక్క నేటిధాత్రి మాత్రమే. మునుగోడుపై ముఖ్యమంత్రి కేసిఆర్‌కు ఎంత ప్రేమ వుందనేది కూడా చూపించింది నేటిధాత్రి మాత్రమే. ఫ్లోరైడ్‌ సమస్య తరిమేసిన విషయాన్ని మళ్లీ ప్రజల ముందు పెట్టింది నేటిధాత్రినే. కూసుకుంట్లకు పార్టీ శ్రేణులు వ్యతిరేకంగా జట్టు కట్టినా, అందరినీ ఒక్కటి చేయడంతో నేటిధాత్రి చూపిన కూసుకుంట్ల మర్చిపోకూడదు. కూసుకుంట్లకు క్లిష్ట కాలంలో అండగా నిలిచింది కూడా నేటిధ్రాతినే. మరి అలాంటి నేటిధాత్రి మునుగోడులో పరిస్దితులను ఎప్పటికిప్పుడు వివరిస్తుంటే కూసుకుంట్లకు నచ్చడం లేదు? అందుకు నేటిధాత్రి మీద విషం చిమ్ముతున్నాడు. కూసుకుంట్లను నిలదీసే హక్కు నేటిధాత్రికి మాత్రమే వుంది. నేటిధాత్రి ఇచ్చిన నైతిక మద్దుతు, అక్షరాల కవచం అంత గొప్పది. మేలు చేసిన వారిని మర్చిపోయిన వ్యక్తైనా, వ్యవస్ధ అయినా మనుగడ కష్టం. అదే ఇప్పుడు కూసుకుంట్లకు కూడా కనిపిస్తోంది. ఎంతో కష్టపడి పార్యీ శ్రేణులన్నీ ఏకమైన కూసుకంట్లను గెలిపిస్తే వారిని కనీసం పట్టించుకోవడం లేదన్న విషయాలు అనేకం నేటిధాత్రి దృష్టికి వస్తున్నాయి. నిజానికి మునుగోడులో పార్టీ ఎంతో బలంగా వుంది. కాని కూసుకుంట్ల నాయకత్వమే బలహీనంగా వుంది. అలాంటి నాయకుడిని ప్రతిసారి కాపాడుకుంటూ రావడం పార్టీకి కూడా తలకు మించిన భారమే అవుతుంది. ఉప ఎన్నిక అంటే అందరూ వచ్చి కూసుకుంట్లకు మద్దతుగా నిలిచారు. ప్రచారం సాగించారు. కాని సార్వత్రిక ఎన్నికల్లో కూసుకుంట్ల ఒంటిరి పోరు చేయాల్సివుంటుంది. అది ఆయన వల్లకాని పని. అప్పనంగా మళ్లీ 2018 ఎన్నికల్లో జరిగినట్లు జరిగేందుకు కూడా కూసుకంట్లే కారణం కావొచ్చు. అందుకే ప్రజలు ఆసారి ఎలాగైనా కూసుకుంట్లను పక్కన పెట్టాలని కోరుతున్నారు. మునుగోడులో ఏం జరుగుతోంది. ప్రజలు ఏం అనుకుంటున్నారన్నది పూర్తిగా నేటిధాత్రి చేతిలో రిపోర్టు వుంది. పార్టీ నాయకులు చేసిన పనులకు బిల్లులు కూడా కూసుకంట్ల ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నాడంటే ఇక పార్టీ కోసం పనిచేయమంటే ఎలా చేస్తారు? సొంత పార్టీ నేతలను కూసుకుంట్ల ఇబ్బందుల పాలు చేయడాన్ని ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. కేవలం కూసుకంట్ల వల్ల ఉప ఎన్నికల సమయంలో పార్టీ కూడా కొంత దెబ్బతిన్నది. బిసి సామాజిక వర్గానికి చెందని బలమైన నాయకుడు, ఉద్యమకారుడైన ఓ నేత పార్టీని వదిలి వెళ్లిపోయాడు. మునుగోడులో ఎంతో బలమైన మూడు బిసి, సమాజిక వర్గాలకు చెందిన నాయకులను కాదని, కూసుకుంట్లకు టిక్కెట్‌ ఇస్తే దానిని నిలుపోకపోవం ఆయన వ్యవహార శైలికి నిదర్శనమంటున్నారు. ఈసారి కూసుకుంట్లకు కాకుండా, బసిలలో ప్రజల కు చేరువగా వుంటున్న నాయకులకు టిక్కెట్లు ఇవ్వాలని సూచిస్తున్నారు. ఆ నేతల్లో ఎవరినో ఒకరిని ఎంపిక చేయాల్సిన అవసరవం వుంది. ప్రజల క్షేమం కోసం, వారి అభ్యున్నతి కోసం పనిచేస్తున్న నేతలున్నారు. అలాంటి వారి గురించి మునుగోడులో కూడా మంచి పేరుంది. అలాంటి నాయకుడిని గుర్తించాలి. ఒక వేళ మళ్లీ కూసుకుంట్లను ప్రజల మీద రుద్దితే మాత్రం 2018 ఎన్నికల ఫలితాలు పునరావృతం కావడం ఖాయం? అంటున్నారు జనం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!