అయ్యప్ప భక్తుల అన్నదానానికి ఎంపీ రవిచంద్ర వితరణ

ఖమ్మం, నవంబర్, 5:

అఖిల భారత అయ్యప్ప దీక్షా ప్రచార సమితి ఆధ్వర్యంలో

నగరంలోని వీడీవోస్ కాలనీలో నిర్వహిస్తోన్న అన్నప్రసాద వితరణ (అన్నదానం) కు రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర భూరి విరాళం అందజేశారు. అన్నదానానికి అవసరమైన పలు నిత్యావసర

సరుకులను ఆయన సమకూర్చారు. ఈ సరుకులను శనివారం ఎంపీ రవిచంద్ర తనయుడు వద్దిరాజు నిఖిల్ అయ్యప్ప భక్తుల సమక్షంలో నిర్వాహకులకు అందజేశారు. తొలుత ఆయనకు స్వాములు ఘన స్వాగతం పలికి.. పీఠం లోనికి తోడ్కొని వెళ్లారు. అక్కడ అభిషేకం, పూజలు నిర్వహించి అన్నదానం ప్రారంభించారు. నిఖిల్ స్వయంగా అయ్యప్ప భక్తులకు వడ్డించి.. వారి ఆశీస్సులు స్వీకరించారు. అయ్యప్ప భక్తుల ఆకలి తీర్చడం కోసం పెద్ద మనసుతో అన్నదానానికి అవసరమైన సరుకులు అందజేసిన ఎంపీ రవిచంద్రకు పీఠం నిర్వాహకులు, అయ్యప్ప భక్తులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పీఠం వ్యవస్థాపకులు తాండ్ర రాంప్రసాద్ గురుస్వామి, పగడాల కిషోర్, శీలంశెట్టి జానకిరామ్, గుత్తా శేఖర్, శీలం గోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version