ఏబివిపి,బీజేపీ నుండి బి.ఆర్.యస్.లో చేరిన యువకులు

పరకాల నేటిధాత్రి
పరకాల నియోజకవర్గంలోని పరకాల పట్టణం నందు ఏ బి వి పి మరియు బీజేపీ నాయకులు పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సమక్షంలోపార్టీ లో చేరిన వారు సవిండ్ల శశిధర్ ఓ బీసీ మోర్చ పరకాల పట్టణ కార్యదర్శి వీద ప్రశాంత్ ( సీనియర్ ఏభివిపి నాయకులు),బొచ్చు దిలీప్ ( సీపీఐ నాయకుడు ), అరిగెల కరుణాకర్,చేరిపెళ్లి విష్ణు,ఇర్యాల విజయ్ , మహ్మద్ సమీర్,కోగిల నందు, పిట్ట కౌశిక్,బండారి అభితేజ,దాసరి ప్రణీత్, కాడారి అఖిల్,బండి పవన్, ముల్కనూరి వంశీ,బోయిని విగ్నేష్,అల్లం పవన్,అల్లం రణదీర్,ఇప్ప సాయి చంద్ , రుద్రరాపు రిశీత్ , వీర్ల శివ కుమార్ బి.ఆర్.యస్.లోకి చేరడం జరిగింది.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ యువత ఆలోచించాలని పరకాల ప్రజల కొరికైనటువంటి రెవెన్యూ డివిజన్ ను ముఖ్యమంత్రి కేసీఆర్ తో కొట్లాడి సాధించి తీసుకువచ్చామని, పరకాల పట్టణంను అన్ని రకాలుగా అభివృద్ధి చేసామని,పరకాల కు నిధులు తీసుకువచ్చి 100 పడకల ఆసుపత్రి ఏర్పాటు చేసుకున్నామని ఆ ఆసుపత్రి పనులు ముమ్మరంగా సాగుతున్నాయని అన్నారు. మరోసారి గెలిపిస్తే మరింత అభివృద్ధి చేస్తామని తెలిపారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెంట ప్రజాప్రతినిధులు,బి.ఆర్.యస్.పార్టీ నాయకులు,కార్యకర్తలు , తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version