పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన స్థానిక శాసన సభ్యురాలు యశస్విని ఝాన్సి రెడ్డి

పాలకుర్తి నేటిధాత్రి

పాలకుర్తి మండల కేంద్రంలో నూతన సీసీ రోడ్డు పనుల ప్రారంభానికి శంకుస్థాపన చేసిన స్థానిక శాసన సభ్యురాలు శ్రీమతి యశస్విని ఝాన్సీ రెడ్డి. పాలకుర్తి మండలంలో దర్దపల్లి గ్రామంలో నూతన సీసీ రోడ్డు పనుల ప్రారంభానికి శంకుస్థాపన చేసిన స్థానిక శాసన సభ్యురాలు యశస్విని ఝాన్సీ రెడ్డి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని ఝాన్సి రెడ్డి మాట్లాడుతూ గ్రామాలు అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం తోనే సాధ్యం అని, అన్ని గ్రామాల అభివృద్ధికి సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాలకుర్తి బ్లాక్ అధ్యక్షులు రాపాక సత్యనారాయణ, మండల అధ్యక్ష కార్యదర్శులు కుమారస్వామి, భాస్కర్, పార్టీ ముఖ్య నాయకులు, యూత్ నాయకులు, తదితరులు, పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *