యాసంగి ధాన్యం కొనుగోళ్ళను వేగవంతం చేయాలి

జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా

భూపాలపల్లి నేటిధాత్రి

గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో యాసంగి ధాన్యం కొనుగోళ్ల పై వ్యవసాయశాఖ, సహకార శాఖ, తూనికలు కొలతలు, మార్కెటింగ్, డిఆర్డీఏ పౌర సరఫరాలు, పౌర సరఫరాల సంస్థ, రైస్ మిల్లర్లు, కొనుగోలు కేంద్రాల ఇంచార్జిలతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ
యసంగి ధాన్యం కొనుగోలు చేసేందుకు జిల్లా వ్యాప్తంగా117 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ఇప్పటి వరకు 16 వేల 500 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామని తెలిపారు.

వాతావరణంలో మార్పుల వల్ల అకాల వర్షాలు కురిసే అవకాశం ఉందని కొనుగోలు కేంద్రాలలో ధాన్యం తడిసి పాడవకుండా కొనుగోలు కేంద్రాలు నిర్వాహకులు తగు రక్షణ చర్యలు చేపట్టాలని అన్నారు. ఇప్పటివరకు 3 వేల టార్పలిన్ లు కొనుగోలు కేంద్రాలకు సరఫరా చేయడం జరిగిందని అన్నారు. మాయిచ్చర్ మిషన్లును కూడా అందించామని తెలిపారు. కొనుగోలు కేంద్రాలలో వర్షాల వల్ల ధాన్యం తడవకుండా చర్యలు చేపట్టాలని వర్షం వల్ల ధాన్యం తడిస్తే తీసుకోవలసిన జాగ్రత్తల పై రైతులకు అవగాహన కల్పించాలని అన్నారు.
కొనుగోలుకు సంబంధించి ఏ రోజుకారోజు డాటా ఎంట్రీ చేయాలని, రిజిస్టర్స్ నిర్వహించాలని, డాటా ఎంట్రీ చేయని కొనుగోలు కేంద్రాలకు షోకాజ్ నోటీస్ లు జారీ చేయాలన్నారు.
రెండు రోజులలోగా ఓ.పీ.ఎం.ఎస్ లో డాటా ఎంట్రీ పూర్తి చేయాలని ఆదేశించారు.
కొనుగోలు కేంద్రాలలో ధాన్యం తడవకుండా జాగ్రత్తలు చేయాలని,
వరి కోతలు మొదలైనందున ఎక్కువ మొత్తంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలకు రావడం జరుగుతుందని అన్నారు. వర్షం కురిసే అవకాశం ఉంటే వెంటనే అప్రమత్తం కావాలని అన్నారు.
నాణ్యత ప్రమాణాలు ప్రకారం 17 శాతం తేమ ఉండేటట్లుగా చూసుకోవాలని, తాలు, మట్టి పెల్లలు లేకుండా చూసి మిల్లులకు తరలించాలని తెలిపారు. రాబోయే 15 రోజుల చాల కీలకమని వ్యవసాయ శాఖ అధికారుల అంచనా ప్రకారం ఇంకా సుమారు 45 వేల మెట్రిక్ టన్నుల వరకు ధాన్యం కొనుగోలు కేంద్రాలకు రావొచ్చని అప్రమత్తంగా ఉండి కొనుగోలు చేయాలని పేర్కొన్నారు.
రైతులు వర్షాల వల్ల ధాన్యం తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని రైతుల దగ్గర ధాన్యం ఆరబెట్టడానికి స్థలం లేక పోతే కొనుగోలు కేంద్రాలకు తరలించి వాటిని టార్పలిన్ల తో కప్పుకోవాలని ఎత్తైన ప్రదేశాలలో ధాన్యాన్ని అరబెట్టాలని, రోడ్లపై ధాన్యాన్ని ఆరబెట్టడం వల్ల వర్షం వస్తే తరలించడం చాలా ఇబ్బందిగా ఉంటుందని అన్నారు.
వ్యవసాయ శాఖ అధికారులు గ్రామాలలో వరి పండించే రైతులతో వాట్సప్ గ్రూప్ ఏర్పాటు చేసి ఎప్పటి కపుడు వాతావరణ శాఖ జారీ చేయు సూచనలు రైతులకు ఇవ్వాలని అన్నారు. రైతులకు ధాన్యం తడవకుండా అవగాహన కల్పించాలని, వర్షం కురిసే అవకాశం ఉంటే ముందస్తుగా సూచించాలని అన్నారు. కోతలు సమయంలో చేపట్టవలసిన చర్యలు, వరి కొనుగోలు కేంద్రాలకు వచ్చే ధాన్యం వివరాలను ఏరోజుకు ఆరోజు నివేదికలు తనకు అందించాలని తెలిపారు.
ఏదైనా సాంకేతిక సమస్య ఉంటే వెంటనే అధికారులకు తెలియజేయాలని కలెక్టర్ పేర్కొన్నారు..
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి విజయ్ భాస్కర్, డిఆర్డిఓ నరేష్, పౌర సరఫరాల అధికారి నర్సింగరావు
జిల్లా సివిల్ సప్లై సంస్థ మేనేజర్ రాఘవేందర్, తూనికలు కొలతల శాఖ అధికారి శ్రీలత, మార్కెటింగ్ శాఖ అధికారి కనక శేఖర్, రైస్ మిల్లర్లు సంఘం సభ్యులు, కొనుగోలు కేంద్రాల ఇంచార్జిలు, వ్యవసాయ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version