వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పని చేయాలి

బీఆర్ఎస్ కార్యకర్తలు అందరూ ఐకమత్యంగా ఉండాలి

శాయంపేట నేటిధాత్రి:

భూపాలపల్లి మాజీ శాసనసభ్యులు గండ్ర వెంకటరమణారెడ్డీ వరంగల్ రూరల్ జిల్లా మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ & బీఆర్ఎస్ పార్టీ భూపాలపల్లి జిల్లా అధ్యక్షురాలు గండ్రజ్యోతి ఆదేశానుసారం క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి వివిధ గ్రామాల్లో శాయంపేట మాజీ ఎంపీపీ మెతుకు తిరుప తిరెడ్డి ఆధ్వర్యంలో గోవింద పూర్ గ్రామకమిటీని ఏకగ్రీవం గా ఎన్నుకోవడం జరిగింది. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపే తానికి వివిధ గ్రామాల్లో పర్యటించి కొద్దినెలల్లో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మండలంలోని అన్ని గ్రామాల్లో పూర్తిస్థాయిలో అన్ని స్థానాలను గెలిపించుకోవాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్క కార్యకర్త ఐక్యమత్యంతో కలిసికట్టుగా పనిచేసి మండలంలో బిఆర్ ఎస్ జెండా ఎగుర పిలుపుని చ్చారు.గోవిందపూర్ గ్రామ శాఖ అధ్యక్షుడిగా దాసి శ్రావణ్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నుకో వడం జరిగింది ప్రధాన కార్యదర్శి నర్రా రాజు ఉపాధ్యక్షులుగా బొత్స మహేందర్ బైరి రాజకుమార్ సంయుక్త కార్యదర్శిగా రాజేశ్వరరావు ప్రచార కార్యదర్శి కాల్వల సతీష్ మరియు సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందిఈ కార్యక్రమంలో మండల కమిటీల కోఆర్డినేట్ సభ్యులు మాజీ మార్కెట్ వైస్ చైర్మన్ మారేపల్లి నందం మాజీ మండల పార్టీ అధ్యక్షుడు గుర్రం రవీందర్ మాజీ ఎంపిటిసిల ఫోరం మండల అధ్యక్షులు మేకల శ్రీను మాజీ ఎంపీటీసీ విష్ణువర్ధన్ రెడ్డి, గడిపే విజయ్ మాజీ సర్పంచ్ అరికిల్ల ప్రసాద్ బైరి శ్రీను, బిఆర్ఎస్వి రాష్ట్ర నాయకులు కొమ్ముల శివ మండల ముఖ్య నాయకులు మారేపల్లిమోహన్ కరుణ్ బాబు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version