రంజిత్ రెడ్డిని గెలిపించి మన నియో జకవర్గ పరిధిలోని మిగిలి ఉన్న అభివృద్ధి సత్వరంగా చేసుకోండి:

మాజీ కార్పొరేటర్ జానకి రామరాజు

కూకట్పల్లి మే 1 నేటి ధాత్రి ఇన్చార్జి

శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని తులసీనగర్ ప్రాంతంలో బుధవారం రోజు ఉదయం 9 గంటల ప్రాంతంలో గడప గడపకు ప్రచారంలో భాగంగా మాజీ కార్పొరేటర్ జానకిరామరాజు ఆధ్వర్యం లో ప్రముఖ న్యాయవాది కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ప్రమీల ఆయా ఓటర్ల వద్దకు వెళ్లి వచ్చేనెల 13న జరగబో యే ఎంపీ ఎన్నికలలో తమ అభ్యర్థి చేవెళ్ల పార్లమెంట్ సభ్యుడు గడ్డం రంజిత్ రెడ్డిని అత్యధిక ఓట్లు వేసి గెలిపిం చాలని తెలిపారు.ఈ సందర్భంగా మాజీ కార్పొరేటర్ జానకి రామరాజు,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు ప్రమీల మాట్లాడుతూ…. కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతంగా చేయాలన్న ఎంపీ రంజిత్ రెడ్డిని గెలిపించినట్లయి తే,ఇప్పటివరకు అందుతున్న సంక్షే మ పథకాలలో 6 గ్యారెంటీలలో ఇప్పటివరకు అమలు అయినవి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యు త్,గ్యాస్ సబ్సిడీ,ఉచిత బస్సు సౌక ర్యం వంటివి నిరుపేద ప్రజలకు అం దుతున్నాయని తెలిపారు.మిగిలి ఉన్న సంక్షేమ పథకాలు మరింత సత్వరంగా అమలు కావాలన్నా
మనం మన ఎంపీ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి గత పది సంవత్సరాలు కేంద్రం నుంచి నిధులనుతీసుకువచ్చి మంచి అభివృద్ధి జరిగేలా చూసిన మంచి వ్యక్తిగా కొనసా గుతున్న ఇత నికి బంపర్ మెజారిటీ ఇచ్చినట్ల యి తే మన ప్రాంతాలు మరింత అభివృ ద్ధి జరుగుతుందని చెప్పడంలో ఎటు వంటి సందేహం లేదని వారు పేర్కొ న్నారు.ఈ కార్యక్రమంలో పలువురు మహిళా నాయకులు కార్యకర్తలు పలు సంక్షేమ సంఘాల నాయకులు తదిత రులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version