బిజెపి పార్టీ గెలుపు కోసం ఇంటింటా విస్తృత ప్రచారం

శాయంపేట నేటి ధాత్రి:

శాయంపేట మండలంలోని కేంద్రంలో 306 బూత్ అధ్యక్షులు భాసని నవీన్ ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచార నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చందుపట్ల సత్యపాల్ రెడ్డి విచ్చేసి ఇంటింటి ప్రచారం పాల్గొని అనంతరం ఆయన మాట్లాడుతూ మరొక్కసారి నరేంద్ర మోడీ మూడోసారి గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉందని మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సంక్షేమ పథకాలు ఈ రోజున పల్లె పట్నం అని తేడా లేకుండా ప్రతి గ్రామంలో పేద మధ్యతరగతి ప్రజలకు చేరాయని కరోనా కష్టకాలంలో కూడా దేశాన్ని కాపాడుకున్న గొప్ప మహా నాయకుడు అని ఏ దేశం చేయని విధంగా ఉచిత కరోనా టీకాను ఇప్పించిన ఘనత మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆయన యొక్క ఆలోచన విధానాలతోని ఈరోజు ప్రపంచంలోనే అగ్రగామిగా మన భారతదేశం అభివృద్ధి చెందుతున్నదని బడుగు బలహీన వర్గాలకు పెద్దపీట వేస్తూ ఆయన విశ్రాంతి లేకుండా పనిచేస్తున్నారని అలాంటి నాయకుడు మనకు దొరకడం అనేది మన దేశ ప్రజల అదృష్టమని మళ్లీ ఒకసారి నరేంద్ర మోడీ ప్రధానమంత్రి చేయాల్సిన బాధ్యత మన అందరి పైన ఉన్నదని కావున పార్టీలకతీతంగా నరేంద్ర మోడీ గారి అభివృద్ధిని కొనియాడు తున్నారని ప్రతి ఒక్కరూ కమలం పువ్వు గుర్తుకు ఓటేసి నరేంద్ర మోడీ గారికి వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి ఆరూరి రమేష్ గెలిపించి ఒక బహుమతిగా ఇవ్వాల్సిన బాధ్యత మన అందరి పైన ఉన్నదని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు రాయరాకుల మొగిలి మండల ప్రధాన కార్యదర్శి నరహరిశెట్టి రామకృష్ణ కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు కానుగుల నాగరాజు సీనియర్ నాయకులు గంగుల రమణారెడ్డి బాసనీ విద్యాసాగర్ భూత అధ్యక్షులు మేకల సుమన్ సంజీవ్ సుధాకర్ సాంబయ్య రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version