కాశీబుగ్గ, నేటిధాత్రి
వరంగల్ తూర్పు పరిధిలో, కాశిబుగ్గ 19వ డివిజన్ లో వీకర్ సెక్షన్ కాలనీలో, న్యూ యువ యూత్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా, నాలుగో రోజున కాలనీ మహిళలు గణనాథుడుకి ప్రత్యేక కుంకుమ పూజ కార్యక్రమాలు చేపట్టినారు. ఈ కార్యక్రమంలో మార్త శోభారాణి, ఆవునూరు కృష్ణవేణి, దాసరి శైలజ, బైరిదీప్తి,రజిత, గాదె సరిత, దాసరి రజిని, నేరెళ్ల అరుణ, కులుకులపల్లి కామేశ్వరి మరియు న్యూయువ యూత్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు కలివెలి రాజు (శేషు), సిలివేరు రాజు, మోర రవి, వేల్పుల శంకర్, బైరి తరుణ్, కొంగర నవీన్, గోలి సాయి, రవిరాకుల సన్ని, గుజ్జుల రాకేష్ రెడ్డి, సిలివేరు రాజేష్ తదితరులు పాల్గొన్నారు.