ఐనవోలులో పారిశుద్యంపై పట్టింపేది?

ఆలయ ప్రహరీని ఆనుకొని కుళ్ళిన కుక్క కళేబరం 

దుర్గంధం వెధజల్లుతున్న నిత్యం ప్రజలు తిరిగే ప్రాంతం 

అటు ఆలయ సిబ్బంది ఇటు గ్రామ పంచాయతీ సిబ్బంది నిత్యం పరిశుధ్య పనులు 

అయినా పట్టు(ట్టించు)కోని అధికారులు

నేటి ధాత్రి ఐనవోలు/హన్మకొండ:-

ఐనవోలు మల్లికార్జున స్వామి ఆలయం నుండి నంది విగ్రహం వరకు నిత్యం ప్రజలు తిరిగే ప్రాంతం అది. భక్తులు గ్రామస్తులు నిత్యం అదే దారి గుండా ప్రయానిస్తుంటారు. కానీ అదే దారిలో గత రెండు రోజులుగా ఓ శునకం చనిపోయి కుళ్ళుపోయి దుర్గంధం వెధజల్లుతున్నా, పట్టించుకున్న నాధుడు లేడు. పారిశుద్యం పేరుతో నిత్యం అటు ఆలయ సిబ్బంది ఇటు గ్రామ పంచాయతి సిబ్బంది నిత్యం పని చేస్తున్నా, కుళ్ళిన వ్యర్ధాన్ని గుర్తించి తొలగించడం లేదు అంటే పారిశుద్యంపై గ్రామ పంచాయతీ సిబ్బందికు ఎంత పట్టింపు ఉందొ అర్ధం అవుతుంది.గ్రామ పంచాయతీ పాలక వర్గం లేకపోవడం అధికారం చెలాయిస్తూన్న అధికారులు సిబ్బందిని అజమాయిషీ చేయడంలో విఫలం అవుతున్నారు అనడంలో అతిషయోక్తి లేదు.పనుల పేరుతో ఫొటోలకు పోజులు ఇస్తూ సొంత వ్యాపార పనులు చేసుకుంటూ, గ్రామ ప్రజలు సమస్యలపై పిర్యాదు చేసిన పంచాయితీ సిబ్బంది పట్టించుకోరు అన్న అపవాదు ప్రజల నుంచి వినిపిస్తుంది. ఏది ఏమైనా పరిశుద్యం విషయంలో అటు పట్టించుకోవాల్సిన అధికారులు పని చేయాల్సిన సిబ్బంది పనితీరులో డొల్లతనం మరోసారి బయట పడింది. ఇప్పటికైనా అధికారులు స్పందించి శునక కళేభరాన్ని తొలగించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.

 

 

*పారిశుద్యం విషయంలో జవాబుదారీతనం ప్రదర్శించిన ఎస్సై. పలువురి ప్రశంస*

 

సంక్రాంతి సందర్భంగా ఐనవోలులో మూడు నెలల పాటు మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఇందులో భాగంగా ఇతర ప్రాంతాల నుంచి జాతరకు వచ్చే భక్తుల వాహనాలను పార్కింగ్ చేయడం ప్రతీ ఏటా కత్తిమీద సాములా తయారు అయ్యింది.ఇన్నాళ్లు పాలకులు ఆదాయ మార్గాలపైనే దృష్టిసారించారు కానీ, భవిష్యత్ లో భూమి ధరలు పెరిగి పార్కింగ్ చేయడానికి స్థలం లేకుండా పోతుందన్న విషయాన్నీ గ్రహించడంలో అన్ని పార్టీల పాలకులు విఫలం అయ్యారు. తద్వారా జాతరకు వచ్చిన వాహనాలను పార్కింగ్ చేయడానికి పోలీసులు ప్రయివేట్ వ్యక్తుల భూములు అడిగితే, వాహనాలు పార్కింగ్ చేసి భక్తులు విడిచిన వ్యర్థ్యాలతో జాతర తర్వాత తిప్పలు పడాల్సి వస్తుందని ఆ రైతులు భూమి ఇవ్వడానికి ముందుకు రాకపోయినా, ఎలాగోలా పోలీసులు ప్రయివేట్ వ్యక్తులను ఒప్పించి భూమిని తాత్కాలికంగా చదును చేసి భక్తుల వాహనాలకు అందుబాటులో ఉంచారు. జాతర తర్వాత ఇచ్చిన మాట ప్రకారం ఐనవోలు ఎస్సై శ్రీనివాస్ గురువారం పార్కింగ్ కు కేటాయించిన స్థలాల్లో ఉన్న వ్యర్థ్యాలను జె.సి.బి సాయంతో తొలగించి చెత్త చెధారం అంతా తగులబెట్టించారు.అంతేగాక గ్రామాల్లో యువత మద్యం, మత్తు పదార్ధాలకు బానిస కాకుండా క్రీడల వైపు మల్లించడానికి ఇదే స్థలంలో ఆటల పోటీలు నిర్వహించనున్నట్లు ఎస్సై తెలిపారు. ఇలా జవాబుదారీతనంతో రైతులకు ఇచ్చిన మాట ప్రకారం భూమిని శుభ్రం చేసి ఇవ్వడమే గాక యువత మానసిక ఉల్లాసం కొరకు క్రీ“డా పోటీలను నిర్వహించాలన్న ఎస్సై ఆలోచనను పలువురు ప్రశంశిస్తున్నారు..

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version