తెలంగాణలో 10 లోకసభ సీట్లు గెలుస్తాం

రాముడు అందరి వాడు, ప్రతిపక్షాల ఆరోపణ సిగ్గు చేటు

ప్రజల అభిష్టం మేరకే బాలక్ రామ్ ప్రతిష్ఠాపన

___ కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి

వరంగల్ తూర్పు, నేటిధాత్రి

అయోధ్య రామయ్య దర్శనం కోసం వెళ్ళే భక్తులు కాజీపేట మీదుగా ప్రత్యేక రైలులో వెళ్తున్న రామ భక్తులను అభినందించడానికి వరంగల్ విచ్చేసిన కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి. అనంతరం వరంగల్ తూర్పు పరిధిలో బీజేపీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు గంటా రవి కుమార్ ఆధ్వర్యంలో జరిగిన “గావ్ చలో అభియాన్” ప్రోగ్రాంలో ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ,
రాముడిపై బీజేపీ రాజకీయాలు చేస్తుందనేది అవగాహన లేని వాళ్లు చేస్తున్న ఆరోపణలని, అయోధ్య రామాలయం దేశ ప్రజలందరికీ చెందుతుందని, రాముడంటే సత్యానికి, ధర్మానికి, విశ్వాసానికి నిదర్శనమని, రాజకీయాలకతీతంగా ప్రజలంతా దర్శనం చేసుకుంటున్నారని అయోధ్య బాల రాముడి దర్శన్ అభియాన్ రాష్ట్ర కో ఆర్డినేటర్, కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి అన్నారు. దేశాయిపేట్ రోడ్డులోని కేఆర్ గార్డెన్ ఎదురుగా ఉన్న బీజేపీ పార్టీ ఆఫీసులో బీజేపీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ ఆధ్వర్యంలో మంగళవారం అయోధ్య శ్రీ బాల రామ్ మందిర్ దర్శన్ అభియాన్ పై సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వెంకటరమణారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రతిపక్షాలు రాముడిపై రాజకీయాలు చేస్తున్నాయని, బీజేపీ ఎప్పుడు ప్రజల మనసెరిగి పని చేస్తుందని చెప్పారు. హిందుత్వాన్ని, సనాతన ధర్మాన్ని వ్యతిరేకించడమే కాంగ్రెస్‌ నైజమని ఆరోపించారు. ప్రజలంతా రాముడి దర్శనం చేసుకోవాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. తెలంగాణలో రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ 10 ఎంపీ సీట్లు కైవసం చేసుకుంటుందని స్పష్టం చేశారు. మోడీ దేశ రక్షణ కోసం తీసుకుంటున్న నిర్ణయాలపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. అలాగే మోడీ ప్రభుత్వం చేపడుతున్న పథకాలు, సంక్షేమం ప్రతీ ఇంటికి చేరుతున్నాయని చెప్పారు. మోడీ అందిస్తున్న పాలనకు తెలంగాణ ప్రజలు సైతం ఆకర్షితులవుతున్నారని, దీనికి నిదర్శనం అసెంబ్లీ ఎన్నికలేనని స్పష్టం చేశారు. మొదటిసారి జిల్లాకు వచ్చిన అయోధ్య బాల రాముడి దర్శన్ అభియాన్ రాష్ట్ర కో ఆర్డినేటర్, కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి మొదటిసారి వరంగల్ కు రాగా, గంట రవికుమార్ భద్రకాళి అమ్మవారి చిత్రపటాన్ని అందజేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, ఎస్సీ మోర్చా అధ్యక్షుడు కొండేటి శ్రీధర్, మాజీ ఎమ్మెల్యే వన్నాల శ్రీరాములు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కుసుమ సతీష్, ఎర్రబెల్లి ప్రదీప్ రావు, ప్రధాన కార్యదర్శి బాకం హరి శంకర్, వన్నాల వెంకటరమణ, గడల కుమార్ యాదవ్, పొట్టి శ్రీనివాస్ గుప్తా, బండి సాంబయ్య యాదవ్, మల్లాడి తిరుపతిరెడ్డి, బన్న ప్రభాకర్ మరియు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version