చేర్యాల రెవెన్యూ డివిజన్ అంశాన్ని మంత్రుల బృందం ముందుకు తీసుకెళ్తాం

ఈనెల 20 తర్వాత మంత్రుల బృందాన్ని కలుస్తాం

జేఏసీ చైర్మన్ డా. ఆర్ పరమేశ్వర్

చేర్యాలలో జేఏసీ విస్తృత స్థాయి సమావేశం

చేర్యాల నేటిధాత్రి

: చేర్యాల రెవెన్యూ డివిజన్ అంశాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడం కోసం ఈనెల 20 తర్వాత మంత్రుల బృందాన్ని కలసి ఈ ప్రాంత ఆకాంక్షా, ఆవశ్యకతను తెలియజేస్తామని జేఏసీ చైర్మన్ డా. ఆర్ పరమేశ్వర్ తెలిపారు. మంగళవారం మండల కేంద్రంలోని జేఏసి కార్యాలయంలో మాజీ ఎంపీపీ, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ఉమారణి అధ్యక్షతన నిర్వహించిన విస్తృత స్థాయి సమావేశంలో డా.పరమేశ్వర్ మాట్లాడుతూ.. గత నెలలో కలెక్టర్ కు వినతిపత్రం సమర్పించిన సందర్భంలో డివిజన్ ఏర్పాటు కు కలెక్టర్ అనుకూలమైన వైఖరి చెప్పడం వల్ల వారికి కృతజ్ఞతలు తెలుపుతూ తీర్మానం ప్రవేశ పెట్టారు. రెవెన్యూ డివిజన్ అంశాన్ని మరింత తీవ్రతరం చేయడంలో భాగంగా ఈనెల 20తర్వాత మంత్రుల బృందంతో పాటు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, స్థానిక ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి లను కలుడానికి నిర్ణయించారు. ఈ సమావేశంలో జేఏసీ ప్రతినిధులు పుర్మ ఆగంరెడ్డి, అందే అశోక్, అందె బీరయ్య, మల్లిగారి యాదయ్య, కొమ్ము నర్సింగ రావు, దాసరి శ్రీకాంత్, మేక మల్లేశం, మంజె మల్లేశం, ఆవుశర్ల యాదయ్య, సుందరగిరి భాస్కర్, చెరుకు రమణా రెడ్డి, రామడుగు బాల రాజు, పుర్మ సంజీవ రెడ్డి, తడక లింగమూర్తి, పాల లక్ష్మీ నారాయణ, బుట్టి సత్యనారాయణ, ఈరి భూమయ్య, ఎండీ. జహురద్దీన్, గూడ రాజిరెడ్డి, దండ్యాల లక్ష్మారెడ్డి, నర్ర మహేందర్ రెడ్డి, మోకు ఉదయ్ రెడ్డి, కురారం బాల నర్సయ్య, రిటైర్డ్ ఉపాధ్యాయులు పిల్లి చంద్రం, వెంకటాద్రి, ఆరుట్ల వినిత్, జిల్లా వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version