కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఎల్లవేళలా అండగా ఉంటాం..

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధి.

స్టేషన్ ఘనాపూర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి సింగపురం ఇందిరా.

రఘునాథపల్లి( జనగామ) నేటి ధాత్రి:-

కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని పనిచేస్తున్న ప్రతి కార్యకర్తకు ఎల్లవేళలా అండగా ఉంటానని ఎవ్వరికీ ఏ ఆపద వచ్చిన తనను కలవచ్చు అని పిసిసి ప్రధాన కార్యదర్శి స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి సింగపురం ఇందిరా అన్నారు. సోమవారం రఘునాథపల్లి మండల కేంద్రంలో ప్రైవేటు హోటల్ ప్రారంభించారు. అనంతరం బక్రీద్ సందర్భంగా మహమ్మద్ రషీద్ స్వగృహంలో ఏర్పాటు చేసిన విందులో ఆమె పాల్గొన్నారు.రషీద్ గృహంలో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్నీ నెరవేస్తుందని కాంగ్రెస్ అధికారంలో రాగానే ప్రతి లబ్ధిదారునికి అభివృద్ధి అందెల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇస్తున్నారని అన్నారు. స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ అభివృద్ధి ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఎంపీ కడియం కవ్యతో ఎప్పటికప్పుడు మాట్లాడి అభివృద్ధి కోసం చర్చిస్తున్నామని ఆమె తెలిపారు. త్వరలోనే పనిచేసే ప్రతి నాయకునికి కార్యకర్తకు నామినేటెడ్ పదవులు వస్తాయని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి లింగాల జగదీశ్ చంద్ర రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గాదె రమేష్ పటేల్, ఎంపిపి మేకల వరలక్ష్మి నరేందర్,జిల్లా నాయకులు గాదే మహేందర్ రెడ్డి, నీలం యువరాజ్,కడారి రవి,మంచాల ఎల్లయ్య,కట్ట మనోజ్ రెడ్డి,లింగాల ఘనాపూర్ మండల పార్టీ అధ్యక్షులు కొల్లూరు శివకుమార్, వెంకటేశ్వర్ రెడ్డి,శిరీష్ రెడ్డి, కొమురెల్లి పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version