త్రాగునీరు విద్యుత్ ఉపాధి హామీ పనులు పక్కాగా అమలు చేస్తున్నాం.

నేటిధాత్రి ప.గో జిల్లా/భీమవరం

జిల్లాలో త్రాగునీరు, విద్యుత్తు సరఫరా, జాతీయ ఉపాధి హామీ పనులు, ప్రతి ఒక్కరికీ పని కల్పించుటలో పక్కగా అమలు చేస్తున్నామని జిల్లా కలెక్టరు సుమిత్ కుమార్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కె.యస్. జవహర్ రెడ్డి కి తెలిపారు.

మంగళవారం వెలగపూడి సెక్రటేరియట్ నుండి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్. జవహర్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరా, జాతీయ ఉపాధి హామీ పథకం పనులు చేపట్టుట, కూలీలకు ఉపాధి కల్పించుట, వేసవిలో విద్యుత్తు సరఫరా, తదితర అంశాలపై జిల్లా కలెక్టర్లతో సమీక్షించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.యస్. జవహర్ రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుత వేసవిలో రాష్ట్రంలో ఎక్కడా త్రాగునీటికి ఎటువంటి సమస్య తలెత్తకుండా చూడాలని, ఏ చిన్న సమస్య వచ్చినా యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలన్నారు. త్రాగునీటి చెరువులను, సమ్మర్ స్టోరేజీ ట్యాంకులు, మంచినీటి చెరువులు నీటి నిల్వలను క్షేత్రస్థాయిలో పరిశీలించాలన్నారు. రాష్ట్రంలో వేడి గాలులు అత్యధికంగా వీస్తున్న దృష్ట్యా అందుకు అనుగుణంగా ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకం పనులలో నీటి సంరక్షణ పనులు, మంచినీటి చెరువుల డీసిల్టింగ్ పనులకు ప్రాధాన్యత ఇవ్వాలని పని అడిగిన ప్రతి ఒక్కరికి పనికల్పించాలన్నారు. విద్యుత్తు సమస్యలు లేకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, ఎటువంటి చిన్న సమస్యలు తలెత్తినా వెనువెంటనే పరిష్కారం చూపాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కె.యస్.జవహర్ రెడ్డి జిల్లా కలెక్టర్లకు ఆదేశించారు.

వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టరు సుమిత్ కుమార్, డ్వామా పిడి యం.ప్రభాకర రావు, జిల్లా ఆర్డబ్ల్యూయస్ అధికారి బి.వి.వి. నాగేశ్వరరావు, విద్యుత్ శాఖ ఇఇ ఫీర్ అహ్మద్ ఖాన్, తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version