కారు గుర్తుకు ఓటేయండి అభివృద్ధికి సహకరించండి

శాసనసభ్యులు రెడ్యానాయక్

మరిపెడ నేటి ధాత్రి.

మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గo మరిపెడ మండల కేంద్రంలో డోర్నకల్ శాసనసభ్యులు రెడ్యానాయక్ వివిధ గ్రామాలలో పర్యటిస్తూ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేయడం జరిగింది, రాంపురం గ్రామపంచాయతీ నుండి దాట్ల వెళ్లే రోడ్డు మూడు కోట్లతో మంజూరు చేయడం జరిగిందన్నారు కొత్తూరు లో 5 లక్షల రూపాయలతో సీసీ రోడ్డు కు శంకుస్థాపన చేయడం జరిగింది అన్నారు , వాళ్లే తండా నుండి దిగుమల్ల వెళ్లే రోడ్డుకు కోటి 20 లక్షలు బీటీ రోడ్డు శంకుస్థాపన చెయ్యడం జరిగింది అన్నారు, బొడతండ నుండి వీరారం రెండు కోట్ల 8 లక్షల రూపాయలతో బీడీ రోడ్డు శంకుస్థాపన చేయడం జరిగిందన్నారు, అబ్బాయి పాలెం ఎస్డిఎఫ్ నిధుల నుండి కోటి 50 లక్షల తో శంకుస్థాపన చేయడం జరిగింది అన్నారు, గుండెపోరి నుండి బాధ్యతండ వరకు ఒక కోటి రూపాయలు బీడీ రోడ్డుకు శంకుస్థాపన చేయడం జరిగింది అన్నారు, ఉల్లేపల్లి నుండి మన్నెగూడెం ఆకీరు నదిపై 15 కోట్ల తో బ్రిడ్జి కోరకు శంకుస్థాపన చేయడం జరిగిందన్నారు, ఉల్లపల్లి నుండి బోడ తాండవరకు రెండు కోట్లతో తారు రోడ్డుకు శంకుస్థాపన చేయడం జరిగిందన్నారు,అనంతరం సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ
రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ అధ్యక్షతన నిజాయితీతో చిత్త శుద్ధితో కార్యాచరణతో అభివృద్ధి పనులు చేస్తానని నాపై నమ్మకం ఉంటే నాకు ఓటు వేయాలని గ్రామ ప్రజలను అభ్యర్థించారు.
కచ్చితంగా గెలిచినా అనంతరం గ్రామాల న్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసుకుందామని హామీ ఇచ్చారు. కొన్ని పార్టీలు మీ దగ్గరకు వస్తున్నాయి భాజపా కాంగ్రెస్ పార్టీలను అవదని నమ్మితే మోసపోతామని ఆలోచించి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పథకాలను సంక్షేమ పథకాలను చూసి బిఆర్ఎస్ పార్టీకి ఎమ్మెల్యే అభ్యర్థిగా నా కారు గుర్తుకు ఓటు వేసి ముచ్చటగా మూడోసారి కేసీఆర్ ముఖ్యమంత్రి చేయాలని ప్రజలను కోరారు.
ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ జిల్లా పార్లమెంట్ సభ్యురాలు మాలోత్ కవిత, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గుడి నవీన్ రావు ఎంపీపీ అరుణ రాంబాబు జెడ్పిటిసి శారదా రవీందర్ పిఎసిఎస్ చైర్మన్ చాపల యాదగిరిరెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ సింధూర,కాంట్రాక్టర్ రామడుగు అచ్యుత్ రావు, మండల పార్టీ అధ్యక్షులు సత్యనారాయణ రెడ్డి, కేసముద్రం మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రాంపల్లి అశ్విని రవి గౌడ్,మాజీ ఎంపీపీ వెంకన్న, మండల రైతు కోఆర్డినేటర్ కొమ్ము చంద్రశేఖర్, కొమ్ము నరేష్, ప్రభాకర్, లావణ్య నరసింహారెడ్డి, శ్వేతా ముఖేష్,వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు కార్యకర్తలు మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version