కాంగ్రెస్ అభ్య‌ర్థి డాక్టర్ రంజిత్ రెడ్డికి ఓటు వేయండి

శేరిలింగంపల్లి నియోజ‌క‌వ‌ర్గం ఇంఛార్జి జగదీశ్వర్ గౌడ్

కూకట్పల్లి, ఏప్రిల్ 20 నేటి ధాత్రి ఇన్చార్జి

శనివారం ఉదయం కొండాపూర్ డివిజన్ పరిధిలోని
అమర్ సొసైటీలో అనేక కాలనీ అసోసియేషన్ సభ్యు
లతో అల్పాహారం కార్యక్రమంలో పాల్గొన్నారు చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు,కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రంజిత్ రెడ్డి,శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ
ఇంచార్జి జగదీశ్వర్ గౌడ్.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…..హ‌స్తం గుర్తుకు ఓటు వేసి గెలిపిం చాల‌ని,ప్రభుత్వం తరపున అన్ని విధాలా కాలనీ
లలో ఉన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు,ప‌దేళ్ల బీజేపీ పాల‌న‌లో దేశంలో అభివృ
ద్ధి మాటే లేకుండా పోయింద‌న్నారు.సంక్షేమ ప‌థ‌
కాలు క‌నుమ‌రుగ‌య్యాయ‌న్నారు.కార్పొరేట్ శ‌క్తుల
కోస‌మే బీజేపీ ప్ర‌భుత్వం ప‌ని చేస్తుంద‌న్నారు.పేద‌
,మ‌ధ్య త‌ర‌గ‌తి ప్ర‌జ‌ల సంక్షేమాన్ని పూర్తిగా విస్మ‌
రించార‌ని ఆరోపించారు.ఈ కార్యక్రమంలో కాలనీ అసోసియేషన్ సభ్యులు,నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *