సర్పంచ్, పాలకవర్గానికి ఆత్మీయ సన్మానం,
నిజాంపేట (మెదక్) నేటిధాత్రి.
అందరూ కలిసికట్టుగా ఉంటే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని గ్రామ సర్పంచ్ లద్ధ ప్రీతి అన్నారు. మండల పరిధిలోని నందిగామ గ్రామంలో బుధవారం రోజున పాలకవర్గం ఆధ్వర్యంలో ఆత్మీయ సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా బాబు జగ్జీవన్ రామ్ విగ్రహన్ని ప్రారంభించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ ఐదు సంవత్సరాల పదవీ కాలంలో ఎన్నో సంక్షేమ పథకాల ద్వారా అందరి సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి పర్చుకున్నామని, తెలంగాణ రాష్ట్రంతో ఏర్పడిన తర్వాత నూతన మండలంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా మంజూరైన నిధులతో సిసి రోడ్డు, వైకుంఠ డామం, పల్లె ప్రకృతి వనం, డబుల్ బెడ్ రూం లాంటి పలు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నామని, అలాగే పల్లె ప్రగతి ద్వారా తడి పొడి చెత్తను సేకరించి డంపింగ్ యార్డుకు తరలించామని, హరితహారం ద్వారా గ్రామంలో చెట్లను నాటి గ్రామాన్ని సుందరంగా తీర్చిదిద్దామన్నారు. ఇందుకు సహకరించిన గ్రామపంచాయతీ పాలకవర్గానికి, గ్రామస్తులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సిద్ధ రాములు, ఎంపీటీసీ సురేష్, పంచాయతీ కార్యదర్శి ఆరిఫ్ హుస్సేన్, మాజీ సర్పంచులు ఆకుల బాలయ్య, బ్రమ్మచారి, గ్రామస్థులు ఆకుల రమేష్, నాగరాజు,బిజ్జ దాసు తదితరులు పాల్గొన్నారు.