మొగుళ్ళపల్లి నేటి ధాత్రి న్యూస్
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల కేంద్రానికి చెందిన చెక్క కవిత-అశోక్ దంపతుల ఏకైక కుమార్తె మంగళవారం వెలువడిన 10వ తరగతి ఫలితాలలో రాణించింది. చెక్క బిందుశ్రీ పెద్దపల్లి జిల్లాలో చదివింది. తన తల్లిదండ్రులు చెక్క కవిత-అశోక్ దంపతుల కోరిక మేరకు ఉన్నత చదువులను చదవాలనే ఆకాంక్ష మేరకు కష్టపడి చదివి 10లో రాణించింది. మరింత ఉన్నత చదువులను చదివి, ఉన్నతమైన స్థానంలో రాణించి తన తల్లిదండ్రుల ఆశయాలను నిర్వహించే దిశగా దివ్యశ్రీ కోరుకుంటుంది. తమ కూతురు మంచి మార్కులను సాధించినందుకు తల్లిదండ్రులు గర్వపడుతున్నారు.
