భక్తులకు అన్నదానం.
రఘునాథపల్లి( జనగామ) నేటి ధాత్రి :-
కోర్కెలు తీర్చే స్వామిగా ఎంతో ప్రసిద్ధిగాంచిన శ్రీ వేణుగోపాల స్వామి కళ్యాణ మహోత్సవం గురువారం రంగ రంగ వైభవంగా జరిగింది. రఘునాథపల్లి మండలం కోమల్ల గ్రామంలో ఆలయ అర్చకులు అనిల్ బాబు నేపథ్యంలో పూజారులు వేదమంత్రాల తో కళ్యాణాన్ని జరిపారు. కల్యాణ వేడుకలు గ్రామస్తులతోపాటు వివిధ గ్రామాల చెందిన ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అనంతరం భక్తులకు గ్రామస్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.. శ్రీ వేణుగోపాలస్వామి ఆలయానికి ఎంతో వితిష్టత ఉన్నది ,ప్రతి ఏడాది మూడు రోజులపాటు ఇక్కడ బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు కల్యాణ సందర్భంగా అశేష భక్త జనం హాజరై స్వామి వారి కళ్యాణన్ని తిలకించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు గోపాల బాబు,మాజీ సర్పంచులు సుల్తాన్ నరసింహారెడ్డి, వల్లాల అశోక్, వల్లాల ఉపేందర్, పెంట సుమన్, ఉపేందర్. తాటికొండ వెంకటేష్ యాదవ్, కుమార్ స్వామి, తదితరులు పాల్గొన్నారు