వేములవాడ పట్టణ కాంగ్రెస్ పార్టీ ముఖ్యకార్యకర్తల సమావేశం

*హాజరైన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

వేములవాడ, నేటి ధాత్రి:
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని మహాలింగేశ్వర గార్డెన్స్ లో వేములవాడ పట్టణ కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్,వేములవాడ శాసనసభ్యులు,రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆది శ్రీనివాస్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.


రానున్న ఎన్నికల్లో ప్రతీ ఒక్కరూ కష్టపడి పనిచేస్తూ కాంగ్రెస్ పార్టీ గెలుపులో భాగస్వామ్యం కావాలని అన్నారు. గత ఎన్నికల్లో నా గెలుపు కోసం కష్టపడ్డాం ప్రతి ఒక్కరిని చూశానని అందర్నీ కడుపులో పెట్టుకొని చూసుకుంటానని అన్నారు.

ప్రజల ఆశీర్వాదాలవల్ల మన ప్రజా ప్రభుత్వం ఏర్పడిందని,ఏన్నికల ప్రచారం సమయంలో మనం ఇచ్చిన హామీలను తప్పకుండా అమలు చేస్తామని అన్నారు. సమస్యల పరిష్కారానికి మనందరం కలిసికట్టుగా పనిచేద్దామన్నారు.

రానున్న లోక్ సభ ఎన్నికల్లో వేములవాడ నియోజకవర్గ నుండి అత్యధిక మెజారిటీ ఇద్దాం అని, ఏ ఎన్నిక జరిగిన అందరూ కలిసికట్టుగా పనిచేస్తూ ముందుకు పోదాం అన్నారు.

వేములవాడ నియోజకవర్గంలో పాటు జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో తీసుకెళ్దాం అన్నారు. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన విటీడీఏ సమావేశం నిర్వహించినట్లు గుర్తు చేశారు.

నా గెలుపులో భాగస్వామైనా ప్రతి కార్యకర్తకు రుణపడి ఉంటాను అన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version