కరీంనగర్, నేటిధాత్రి:
కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇంచార్జ్ వెలిచాల రాజేందర్ రావు తన జన్మదినం సందర్భంగా బుధవారం ఉదయం హైదరాబాద్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజేందర్ రావుకు హార్థిక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈసందర్భంగా రాజేందర్ రావు ముఖ్యమంత్రికి పూలకుండిని అందజేశారు. నిత్యం ప్రజాసేవలో నిమగ్నమవుతూ కరీంనగర్ అభివృద్ధికి పాటుపడడంలో భగవంతుడు రాజేందర్ రావుకి సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. రాజేందర్ రావుతో పాటు ఆయన కుటుంబ సభ్యులు ఆయురారోగ్యాలతో విలసిల్లాలని, ప్రజలకు మరింత అత్యుత్తమైన సేవలు అందించాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో అభివృద్ధి సంక్షేమ పథకాలకు సంబంధించి రాజేందర్ రావు ముఖ్యమంత్రితో మాట్లాడారు. కరీంనగర్ పర్యటనకు రావాలని మరోసారి ముఖ్యమంత్రికి రాజేందర్ రావు విజ్ఞప్తి చేశారు. సానుకూలంగా స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి త్వరలో కరీంనగర్ కు వస్తానని పేర్కొన్నారని రాజేందర్ రావు ఒక ప్రకటనలో తెలిపారు. కరీంనగర్లో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ప్రత్యేకంగా కృషి చేస్తున్నామని ముఖ్యమంత్రికి ఈసందర్భంగా వివరించారు.